breaking news
Flowering stage
-
పూల మొక్కలతో ఆకర్షణీయంగా విజయవాడ బెంజ్ సర్కిల్
-
‘పొద్దు’ తిరుగుతోంది
జిల్లాలో గతంలో సుమారు 30 వేల హెక్టార్లలో పొద్దు తిరుగుడు సాగయ్యేది. కానీ రైతులు ఇటీవలి కాలంలో ఈ పంట సాగును తగ్గించారు. గతేడాది ఖరీఫ్లో ఎనిమిది వేల హెక్టార్లలోనే సన్ఫ్లవర్ సాగయ్యింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతుండడంతో ఈసారి సుమారు 15 వేల హెక్టార్లలో ఈ పంట సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేలలు అనుకూలం నీరు నిల్వ ఉండని తటస్థ నేలలైన ఎర్ర, చెలక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల కంటే కొంచెం క్షార లక్షణాలు కలిగిన నేలల్లో పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. భూమిలో ఆమ్ల లక్షణాలు ఉంటే విత్తనం మొలకెత్తే స్వభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణం మొక్కలో పటుత్వాన్ని తగ్గిస్తుంది. నూనె శాతం కూడా తగ్గుతుంది. పొద్దు తిరుగుడు మొక్కలు అధిక తేమ శాతాన్ని తట్టుకోలేవు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవద్దు. సాగునేల తయారీ భూమిని నాలుగైదుసార్లు దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. మధ్యస్థ, బరువు నేలల్లోనైతే బ్లేడ్తో ఒకటిరెండు సార్లు కలియదున్నాలి. చదను చేసిన అనంతరం బోదేలు చేసి విత్తనం నాటాలి. విత్తన శుద్ధి ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. విత్తనాలను ముందు 14 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, విత్తే ముందు కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్ లేదా కాప్లాన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత విత్తాలి. నీటి యాజమాన్యం ఎర్ర నేలల్లో ఉష్ణోగ్రతను బట్టి 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి భూముల్లో అయితే 15 నుంచి 20 రోజులకొకసారి నీటిని అందించవచ్చు. శీతకాలంలో తేలిక నేలలకు 4 నుంచి 6 సార్లు, మధ్యస్థ నేలలకు మూడు నుంచి నాలుగుసార్లు, బరువు నెలలకు రెండు నుంచి మూడుసార్లు నీటిని పారించాలి. ఎరువుల వాడకం విత్తనం వేసే మూడు వారాల ముందు ఎకరాకు 3 టన్నుల పశువుల పేడను వేసి దున్నాలి. ఇది భూమిని సారవంతం చేస్తుంది. భాస్వరం, పోటాష్ ఎరువులను దుక్కిలోనే వేయాలి. నత్రజనిని విత్తనం నాటే సమయంలో, మొగ్గ తొడిగే దశలో, పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. పూత దశలో ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల బొరాక్స్ మందును(లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ చొప్పున కలపాలి) పిచికారి చేయాలి. దీని వల్ల గింజలు ఎక్కువగా తయారవుతాయి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. సస్యరక్షణ చర్యలు పొద్దుతిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు, లద్దె పురుగు, గొంగళి పురుగు, పచ్చపురుగు, శనగపచ్చ పురుగు, తలను తొలిచే పురుగు లాంటివి ఆశిస్తాయి. ఆకుమచ్చ తెగులు, తప్పు తెగులు, పువ్వుకుళ్లు, బూ జు తెగులులాంటివి సోకే అవకాశాలుంటాయి. వీటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకొని క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. పక్షులు, అడవి పందుల బెడద పొద్దుతిరుగుడు పంటకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలకలు ఎక్కువగా పంటలపై వాలి నష్టం కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లను చేను పైభాగంలో(సూర్యరశ్మి వీటిపై పడే ఎత్తులో) కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించవచ్చు. విత్తనం పట్టాక అడవి పందులు కూడా పంటపై దాడి చేసే అవకాశం ఉంంది. పంట చుట్టూ గుంజలు పాతి ఇనప తీగను చుట్టడం ద్వారా అడవి పందులు రాకుండా చూసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెరుగుతుంది ఈ ఏడు వర్షాభావ పరిస్థితులుండడంతో పొద్దుతిరుగుడు పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. 15 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు సాగవుతుందని భావిస్తున్నాం. మాక్లూర్ మండల పరిధిలోనే వేయి ఎకరాలకు పైగా భూమిలో ఈ పంట సాగయ్యే అవకా శం ఉంది. కోతులు అధికంగా తిరిగే గుట్ట ప్రాంతాల్లో ఈ పంట వేయడానికి రైతులు విముఖత చూపుతారే తప్ప మిగతా మండలాల్లో ఈ పంటసాగు చేసే అవకాశాలున్నాయి. సస్య రక్షణ చర్యలు తీసుకుంటే ఎకరాకు 12 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుంది. హరికృష్ణ, ఏవో, మాక్లూర్ మండలం ఫోన్ నంబర్ : 88866 13125 -
పత్తిపంట ‘పిండి’పిండి
ఖమ్మం వ్యవసాయం: ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుతున్న పత్తి పంటలో పిండినల్లి తెగులు వ్యాప్తిచెందుతోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ తెగులు వ్యాప్తి అధికంగా ఉందని డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. చెను చుట్టూ ఉండే పిచ్చి మొక్కల నుంచి పిండినల్లి పురుగులు పత్తిలోకి చేరుతుండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెగులు లక్షణాలు పెద్ద, చిన్న పురుగులు పత్తి చెట్టు కాడలు, ఆకులు, గూడ, కాయలు, కాండం నుంచి రసం పీలుస్తాయి. ఫలితంగా ఈ భాగాలు వాడి రాలిపోతాయి. చెట్టు పెరుగుదల నిలిచిపోతుంది. కాయలు సరిగా విచ్చుకోవు. విచ్చుకున్న కాయల్లోనూ గింజ నాణ్యత తగ్గుతుంది. పిండినల్లి పురుగు విసర్జించే తేనెవంటి పదార్థం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది. ఈ పురుగు ఆశించిన ప్రదేశాల్లో గండు చీమలు తేనె కోసం తిరగడం గమనించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉంటే పత్తి మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఇది అన్ని దశల్లోనూ సంభవించవచ్చు. పిండినల్లి నివారణ-పంట యాజమాన్య పద్ధతులు గతంలో వేసిన పంట తాలూకు అవశేషాలు పొలం నుంచి తొలగించి కాల్చివేయాలి. అలా చేయని పక్షంలో పిండినల్లి పురుగు ఈ అవశేషాల్లోనే ఉండి వేయబోయే పంటకూ వ్యాపిస్తుంది. పొలం దున్నే సమయంలో చీమల పుట్టలు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయాలి. పొలం గట్లపై పిండినల్లి తెగులు ఆశించిన కలుపు ఉంటే పీకి నాశనం చేయాలి. గట్లపై సాధమైనంతవరకు కలుపులేకుండా చూసుకోవాలి. పిండి పురుగు ఆశించిన కొమ్మలు, మొక్కలు తొలగించి నాశనం చేయడం ద్వారా చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. {పారంభంలో ఈ తెగులు కొన్ని మొక్కలకే వ్యాపిస్తుంది. అప్పుడు ఈ పురుగు సముదాయాన్ని గుర్తించి గోనె పట్టాతో రుద్ది నాశనం చేయాలి. జీవ సంబంధ పద్ధతులు పిండినల్లి పురుగు జీవితచక్రంలో చాలా దశలు ఉన్నాయి. ఈ పురుగును ఆశించే సహజ శత్రువులు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బదనికలు. సహజసిద్ధంగా పిండినల్లి పురుగును ఆశించే ట్రిప్టోలిమస్ మాంట్రోజరి, సిర్ఫిడ్ ఈగలను రైతులు విధిగా రక్షించుకోవాలి. పిండినల్లి నివారణకు పురుగుమందులు వాడేటప్పుడు మేలు చేసే ఈగలకు హాని జరగకుండా తక్కువ డోసు ఉండే రసాయనిక మందునే ఉపయోగించాలి. శిలీంద్రాలు: బవేరియా బాసియానా, వర్టిసిల్లియం లకాని ఫార్మలేషన్స్ వాడి పురుగు ఉధృతిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు. రసాయనిక పద్ధతులు మొదటిదశ పురుగులపై తెల్లని మైనం వంటి పదార్థం ఉండదు. ఈ దశలో కీటక నాశనులను పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ పిండి నల్లి పురుగు మొదట్లో కొన్ని మొక్కలనే ఆశిస్తుంది. ఆశించిన చెట్లు, చుట్టుపక్కల పిచికారీ చేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల పురుగు పక్క మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. పురుగు ఉధృతి పెరిగినప్పుడు ప్రొఫెనోపాస్ మూడు మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి రెండు,మూడు పర్యాయాలూ స్ప్రే చేయాలి. పై మందులతో పాటు సర్ఫ్పౌడర్ 0.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.