fifth day
-
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా అయిదో రోజూ లాభాలు కొనసాగడంతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనాన్స్, ఇంధన, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు ఎగసి 22,187 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు 22,122 వద్ద స్థిరపడింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే తేరుకోని లాభాల బాటపట్టాయి. నిఫ్టీ ఆల్టైం హై(22,187)ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం సరికొత్త శిఖరం(22,122) వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 %, 1.29% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియాలో హాంగ్కాంగ్, జపాన్, ఇండోనేసియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ ఎక్సే్చంజీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా ప్రెసిడెంట్స్ హాలిడే కావడంతో అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. మార్కెట్లు మరిన్ని సంగతులు ► తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చడంతో పేటీఎం షేరు 5% లాభపడి రూ.359 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ► క్యూ3లో నికర లాభం 33% వృద్ధి నమోదుతో క్రిసిల్ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 9.50% ర్యాలీ చేసి రూ.5,039 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 13% ర్యాలీ చేసి రూ.5196 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్ను ఐఆర్డీఏఐ ‘డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్’ నుంచి ‘కాంపోసైట్ ఇన్యూరెన్స్ బ్రోకర్’గా అప్గ్రేడ్ చేయడంతో పీబీ ఫిన్టెక్ షేరు 8% ఎగబాకి రూ.1,004 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్ల సంపద.. ఆల్టైమ్ గరిష్టం మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.20 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
ఫ్రాన్స్లో ఐదో రోజూ అల్లర్లు
పారిస్: ఫ్రాన్స్లో అల్లర్లు ఐదో రోజూ కొనసాగాయి. ఆందోళనకారులు మేయర్ నివాసంపైకి మండుతున్న కారుతో దూసుకువచి్చ దాడికి యతి్నంచారు. పోలీసులతో ఆందోళనకారులు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే, గత నాలుగు రోజులతో పోలిస్తే అల్లర్ల తీవ్రత తగ్గింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు శనివారం రాత్రి మరో 719 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రెలో ట్రాఫిక్ పోలీసులు నేహల్ అనే యువకుడిని కాల్చి చంపడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నేహల్ అంత్యక్రియలు శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. శనివారం రాత్రి పారిస్లో చాంప్స్ ఎలిసీస్ వద్ద గుమికూడిన యువకుల గుంపును పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. ఫ్రెంచి గుయానాలో తుపాకీ బుల్లెట్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. పారిస్ ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు బాణసంచా కాల్చుతూ, రోడ్లపై అడ్డంకులు పెట్టారు. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి వారిని పోలీసులు చెదరగొట్టారు. -
ENG VS AUS Ashes 1st Test: ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్ వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ నివేదిక ప్రకారం.. ఇవాళ ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సమాచారం. అయితే మ్యాచ్ ఆరంభ సమయానికి వరుణుడు శాంతివచ్చని అధికారులు నివేదికలో పొందుపర్చారు. తిరిగి 11 గంటల సమయంలో వర్షం పడేందుకు 84 శాతం అవకాశాలు ఉన్నాయని.. అది మధ్యాహ్న సమయానికి 50-40 శాతానికి పడిపోవచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే కీలకమైన చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించక మానడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్కుమార్రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
Reliance : రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్ హాంఫట్!
గత 5 రోజుల్లో సెన్సెక్స్ 3,817 పాయింట్లు, నిఫ్టీ 1,159 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు 6% కుదేలవడంతో రూ.19.50 లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.9.31 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు చేరింది. ముంబై: స్టాక్ మార్కెట్పై సోమవారం బేర్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలను ఆసరా చేసుకొని వరుసగా ఐదో పంజా విసిరింది. బేర్ ఉగ్రరూపం దాల్చడంతో స్టాక్ సూచీలు రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 1,546 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,492 వద్ద స్థిరపడింది. నిప్టీ 468 పాయింట్లు క్షీణించి 17,149 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల ఇండెక్సులు ఆరుశాతం వరకు క్షీణించాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు ఏకంగా నాలుగు శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లూ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్లో సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,751 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ. 75 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడేలో 9 నెలల కనిష్టానికి... సెన్సెక్స్ ఉదయం 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,023 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 17,575 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి గంటగంటకూ అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు అంతకంతా నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2053 పాయింట్లు నష్టపోయి 56,984 వద్ద, నిఫ్టీ 620 పాయింట్లు కోల్పోయి 16,997 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ ఎక్సేంజీలో 872 షేర్లు షార్ట్ సర్క్యూట్ను తాకాయి. మూడువేలకు పైగా స్టాకులు నష్టాలపాలయ్యాయి. అయితే చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు 57 వేలు, నిఫ్టీ 17 వేలు స్థాయిలని నిలుపుకోలిగాయి. పతనానికి కారణాలు ► అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన మార్కెట్ ప్రతికూల సంకేతాలను అందుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం ప్రారంభానికి(నేటి నుంచి) ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రష్యా–ఉక్రెయిన్ దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం, క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడం, కోవిడ్ తాజా విజృంభణ ప్రపంచ మార్కెట్లలోని సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ► జొమాటో, పేటీఎం పేలవం.. గతేడాది చివర్లో ఎక్సే్చంజీల్లో లిస్టయిన స్టార్టప్, టెక్ తరహా కంపెనీల భారీ పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. బుల్ మార్కెట్ జోరులో లిస్టింగ్లో అదరగొట్టడంతో పాటు కొత్త తరం ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు చేయడంతో ఈ షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరిగాయి. అయితే సంబంధిత కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఆల్టైమ్హై నుంచి కొంతకాలంగా పేటీఎం 60 శాతం, జొమాటో 50 శాతం, నైకా 30 శాతం, పాలసీ బజార్ 40 శాతం చొప్పున క్షీణించాయి. ► దేశీయ పరిణామాలు దేశవ్యాప్తంగా రోజుకు సగటున మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రా ష్ట్రాల ఆంక్షల కొనసాగింపు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. భారీగా నష్టపోయిన రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించినప్పటికీ.., దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4% నష్టపోయి రూ. 2,377 వద్ద స్థిరపడింది. మార్కెట్ నష్టాల ట్రెండ్ అనుగుణంగా షేరులో లాభాల స్వీకరణ జరిగినట్లు నిపుణులు తెలిపారు. షేరు 4% పతనంతో ఆర్ఐఎల్ ఒక్కరోజే రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. ► మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో వొడాఫోన్ ఐడియా ఎనిమిది శాతం నష్టపోయి రూ.11 వద్ద స్థిరపడింది. ఒక దశలో పది శాతం పతనమై రూ.10.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ► న్యూ ఏజ్(కొత్త తరం) జొమాటో, నైనా షేర్లు 20 శాతం చొప్పున క్షీణించాయి. ► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 20.84 శాతం ఎగసి 22.83 స్థాయికి చేరుకుంది. ఐపీవోకు మాన్యవర్ రెడీ సంప్రదాయ దుస్తుల బ్రాండ్ మాన్యవర్ మాతృ సంస్థ వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా కంపెనీ దాదాపు 3.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ ఐపీవోకు అనుమతించమంటూ గతేడాది సెప్టెంబర్లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ రవీ మోడీ ఫ్యామిలీ ట్రస్ట్ 1.81 కోట్ల షేర్లు. అదే బాటలో డ్రీమ్ఫోక్స్ ఎయిర్పోర్ట్ సర్వీసుల ప్లాట్ఫామ్ డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 2.18 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ దేశీయంగా గ్లోబల్ నెట్వర్క్ల క్రెడిట్, డెబిట్ కార్డులుగల వినియోగదారులకు విమానాశ్రయ సంబంధ లాంజ్లు, ఆహారం, పానీయాలు, హోటళ్లు, బదిలీ తదితర పలు సేవలను అందిస్తోంది. రూపాయి 3 వారాల కనిష్టం డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం ముగింపుతో పోల్చితే 17పైసలు బలహీనపడి 74.60 వద్ద ముగిసింది. అధిక క్రూడ్ ధరలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి, ఫారిన్స్ ఫండ్స్ వెనక్కు మళ్లడం, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల వంటి అంశాలు దీనికి నేపథ్యం. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). నేటి బోర్డు మీటింగ్స్ మారుతీ సుజుకీ, సిప్లా, ఫెడరల్ బ్యాంక్, ఇక్రా, యూనిటెడ్ స్పిరిట్స్, మాక్స్ ఇండియా, పిడిలైడ్ ఇండస్ట్రీస్, రేమాండ్, సింఫనీ, స్టార్ సిమెంట్ -
ఐదో రోజూ రయ్!
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా, డాలర్తో రూపాయి మారకం విలువ 25 పైసలు పతనమై 74.93కు చేరినా మన మార్కెట్ మాత్రం లాభపడింది. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నా, వర్షాలు విస్తారంగా కురిసి ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదన్న అంచనాలు కలసివచ్చాయి. బ్యాంక్ల మారటోరియం రుణాలు తగ్గడంతో ఆర్థిక రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 36,675 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 10.800 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐదో రోజూ లాభాలే.. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్నం రెండు గంటల వరకూ లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత లాభాలు స్థిరంగా కొనసాగాయి. ఒక దశలో 216 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, మరో దశలో 236 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 452 పాయింట్ల రేంజ్లో కదలాడింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. ఈ సూచీలు వరుసగా ఇన్నేసి రోజులు లాభపడడం గత నెల రోజుల కాలంలో ఇదే మొదటిసారి. మూడో రోజూ ‘విదేశీ’ కొనుగోళ్లు.. ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత మూడు రోజులుగా నికర కొనుగోళ్లు జరపడం, ముడిచమురు ధరలు 1 శాతం మేర తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. షాంఘై మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా ఇదే రేంజ్ నష్టాల్లో ముగిశాయి. ఏప్రిల్లో 27 శాతంగా ఉన్న మారటోరియం రుణాలు జూన్లో 16 శాతానికి తగ్గడంతో బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం లాభంతో రూ.3,353 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. దాదాపు 120 పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్తి డ్రగ్స్, ఐడీబీఐ బ్యాంక్, ఎస్కార్ట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ గురువారం టీసీఎస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను వెల్లడించనుండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. దాదాపు 370 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఆపిల్ ఇండియా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, లెమన్ ట్రీ హోటల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూపాయి 25 పైసలు పతనం ముంబై: డాలర్తో రూపాయి మారకం విలువ మంగళవారం మరింత క్షీణించింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 74.93 వద్ద ముగిసింది. అంతక్రితం (సోమవారం) ముగింపు రేటు 74.68తో పోల్చితే 25 పైసలు నష్టపోయింది. దీంతో వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. విదేశీ బ్యాంకులు అమెరికా డాలర్ల కోసం పోటెత్తిన కారణంగా ఒక దశలో 74.97 వద్దకు క్షీణించి.. 75 వద్దకు సమీపించింది. స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉండడం కూడా రూపాయి నష్టాలకు కారణమని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది విశ్లేషించారు. కరోనా కేసులు పెరుగుతుండడం, బంగారం ధరలు కొండెక్కడం వంటి ప్రతికూల అంశాలు రూపాయి విలువను కుంగదీస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ అడ్వైజరీ (పీసీజీ) దేవర్స్ వకిల్ అన్నారు. -
ఐదో రోజుకు చేరిన క్షురకుల ఆందోళన
-
ఆ బ్యాంకులో భారీగా బ్లాక్మనీ డిపాజిట్!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జరుగుతున్న డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఢిల్లీలోని జైన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులోని లావాదేవీలపై ఆ రాష్ట్ర ఇన్కం ట్యాక్స్ అధికారులు ఐదు రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున నల్లధనం డిపాజిట్ అయిందని అధికారులు గుర్తించారు. జైన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో 120 కోట్లకు పైగా డబ్బు నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీనిలో చాలా వరకు నల్లధనంగా అనుమానాలున్నాయని వారు తెలిపారు. దీంతో ఇక్కడి భారీ ఎత్తున డిపాజిట్ చేసిన వారిపై విచారణ కొనసాగుతుందని.. ఇందులో భాగంగానే ఐదోరోజు సైతం సోదాలు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. నల్లధనాన్ని మార్చడంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
ఐదో రోజూ భక్తుల హోరు
దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు * పుష్కర ఘాట్లలో తగ్గుతున్న నీటిమట్టం * జూరాల ఘాట్కు భక్తులను అనుమతించని పోలీసులు * నల్లగొండలో ఇంద్రకరణ్, జగదీశ్రెడ్డి విహంగ వీక్షణం * వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి, * పార్టీ ఎంపీ రేణుక పుణ్యస్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఐదో రోజు మంగళవారం కూడా జనప్రవాహం కొనసాగింది. అయితే పుష్కర ఘాట్లలో నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. వీటితోపాటు పలు పుష్కరఘాట్లలో నీటిమట్టం సైతం తగ్గింది. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మహబూబ్నగర్లో 7,80,415, నల్లగొండ ఘాట్లలో 2 లక్షల పై చిలుకు స్నానాలు చేశారన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద నీరు తగ్గడంతో ప్రాజెక్టునుంచి నీటి విడుదలను కట్టడి చేశారు. జూరాల ఘాట్కు వచ్చిన భక్తులను మరో ప్రాంతానికి తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పోలీసు అమర వీరులకు వారి కుటుంబాల సమక్షంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో పిండ ప్రదానం చేశారు. మంత్రులు మహేందర్రెడ్డి రంగాపూర్ ఘాట్లో, లక్ష్మారెడ్డి గొందిమళ్లలో పుష్కర స్నానం చేశారు. గొందిమళ్ల ఘాట్లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించారు. పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పుష్కర స్నానం చేశారు. ఇక వరుస సెలవులు ముగియడంతో నల్లగొండ జిల్లాలో ఐదో రోజు భక్తులు తగ్గారు. మూడు ప్రధాన ఘాట్లు మినహా మిగతావన్నీ వెలవెలబోయాయి. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి పలు ఘాట్లను రోడ్డు, ఆకాశమార్గాన పరిశీలించారు. 20న గవర్నర్ నరసింహన్ మట్టపల్లిలో పుష్కర స్నానం చేస్తారని ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో ఆది, సోమవారాల్లో నిబంధనలు సడలించిన పోలీసులు మంగళవారం మళ్లీ కఠినతరం చేయడంతో కిలోమీటర్ల కొద్దీ నడవలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలకపోవడంతో వారు సాగర్లో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నేడు వైఎస్కు పిండ ప్రదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట పుష్కరఘాట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పిండ ప్రదానం చేయనున్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు రాం భూపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. -
భక్త కృష్ణవేణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాల్లో ఐదో రోజు జనప్రవాహం కొంత తగ్గింది. మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు పనిదినం కావడంతో పుష్కర భక్తులసంఖ్య కొద్ది తగ్గడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. గద్వాల సమీపంలోని జూరాల పుష్కరఘాట్లో నీళ్లు లేకపోవడంతో ఘాట్ను మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వచ్చే వరదనీరు భారీగా తగ్గడంతోపాటు అదే క్రమంలో ప్రాజెక్టునుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నియంత్రించడంతో పలు ఘాట్లలో నీటిమట్టం భారీస్థాయిలో తగ్గింది. జూరాల పుష్కరఘాట్లో మినహా ఎక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లుచేశారు. మరో వారం రోజుల పాటు పుష్కరాలు ఉండడంతో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఘాట్లలో నీటిమట్టం ఉండే లా చూడాలని నీటి పారుదల శాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం సైతం బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్, పస్పుల, నదీ అగ్రహారం, కృష్ణ, పంచదేవులపాడ్, పెద్దచింతరేవుల ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరం..ప్రముఖం ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్జె.దొర బీచుపల్లి పుష్కరఘాట్లో పుణ్యస్నానం ఆచరించగా, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసమేతంగా వచ్చి గొందిమళ్ల పుష్కరఘాట్లో పుణ్యస్నానమాచరించి అనంతరం జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తొలుత జూరాలలో పుణ్యస్నానమాచరించాలని పర్యటన ఖరారు చేసుకున్నప్పటికీ ఆ ఘాట్ నీళ్లు లేవన్న సమాచారంతో రంగాపూర్ ఘాట్ వద్ద పుణ్యస్నానమాచరించారు. గొంది మళ్లలో మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా స్నానమాచరించారు. కర్నూల్ వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక గొందిమళ్ల వీఐపీ ఘాట్లో స్నానమాచరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నది అగ్రహారంలో సంధ్యా హారతిఇచ్చారు. మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి పలు ఘాట్లను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్ శ్రీదేవి బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లను పరిశీలించారు. బీచుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను పరిశీలించడంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ పుష్కర డ్యూటీలో ఉన్న స్వచ్ఛంద సేవకులకు, ఉద్యోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వచ్ఛంద సేవకులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. అన్ని ప్రాంతాల్లో నది హారతి విధిగా ఇవ్వాలని, హారతి ప్రాధాన్యతను ఆధ్యాత్మిక ప్రశస్తిని ప్రజలకు వివరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఇటు సోమశిలలోనూ మంగళవారం భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో పుష్కరస్నానం చేసే భక్తుల రద్దీ కొంత తగ్గడంతో హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొంతమేర సడలించారు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. నేడు మంచాలకట్టలో వైఎస్కు పిండ ప్రదానం కొల్లాపూర్ సమీపంలోని మంచాలకట్ట ఘాట్ వద్ద బుధవా రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదా నం చేయనున్నారు. ఉదయం 11 గంట లకు శాస్త్రోకంగా పిండప్రదానం చేయనున్నారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి కోరారు. -
ఐదో రోజు కనిపించని భక్తుల సందడి
-
ఐదో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ