breaking news
fasal insurance
-
బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!
పంటల బీమా చెల్లించడంలో సంస్థలు ఆలస్యం చేస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 8.69 కోట్లకు పెరిగిందన్నారు. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్ల బీమా పొందారని తెలిపారు.ఈ మేరకు లోక్సభలో మంత్రి మాట్లాడుతూ..‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై ) కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ఆలస్యం చేస్తే కంపెనీలపై 12 శాతం పెనాల్టీ విధిస్తాం. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రాల ప్రీమియం విడుదలలో జాప్యం జరుగుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు అది 8.69 కోట్లకు పెరిగింది. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్లకు బీమా పొందారు. సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలను ఈ పథకం కవర్ చేస్తోంది. 2023లో 5.01 లక్షల హెక్టార్ల పంట భూమి ఈ బీమా పరిధిలోకి వచ్చింది. అది 2024లో 5.98 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దీని ద్వారా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ -
అనుకున్నదే అయ్యింది !
జిల్లా రైతులకు మంజూరైన వాతావరణ బీమా రూ.419 కోట్లు రూ.37 కోట్లు ఫసల్ బీమా వచ్చే అవకాశం మొత్తం బీమా పరిహారం రూ.456 కోట్లు ! జిల్లాకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032.69 కోట్లు ఇందులో చంద్రబాబు సర్కారు ఇచ్చేది రూ.60.34 కోట్లే ఇన్సూరెన్స్ డబ్బు తమకు ఇవ్వాలన్న ప్రభుత్వం రైతులు కోర్టుకెళితే సమస్యలు వస్తాయన్న ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వ వైఖరితో ఈసారి బీమా చేసేందుకు బజాజ్ కంపెనీ విముఖత హెచ్డీఎఫ్సీకి అప్పగింత ప్రభుత్వాన్ని, అధికారులను కోర్టుకు ఈడుస్తామంటున్న విపక్షాలు ’ రైతులను చంద్రబాబు సర్కారు మరోసారి దగా చేసింది. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును తన ఖాతాలో వేసుకుని.. దీంతో పాటు కాస్త చిల్లర విదిల్చి రైతులను ఆదుకునేందుకు తామేదో ఘన కార్యం చేశామని గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైంది. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లింపులో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది. అయినా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించకపోయినా..ఇలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కూడా ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారు. మరోవైపు ‘తాను ఆడిందే ఆట..పాడిందే పాట’ అన్నట్లు చంద్రబాబు రూ.60 కోట్లు మాత్రమే ‘అనంత’ రైతులకు విదిల్చి.. రూ.1,032 కోట్లు ఇచ్చినట్లు తప్పుడు మాటలు చెబుతున్నారు. రూ.1,032.69 కోట్లతో ఇన్పుట్ నివేదికలు గత ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. మరో 4–5 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. వేరుశనగ రైతులు ఎకరాకు సగటున రూ.18 వేలు పెట్టుబడి పెట్టారు. వర్షాభావంతో పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో రూ.3,700 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లింది. అయితే.. అధికారులు రూ.1,032.69 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఇందులో రూ.516.34 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు నిధులు విడుదల చేయాలి. కానీ రూ.60.34 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. తక్కిన రూ.456 కోట్లను బీమా పరిహారం నుంచి సర్దుబాటు చేసి.. దాన్ని ఇన్పుట్ సబ్సిడీలో కలిపి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లింపులోనూ మోసమే.. ఇన్సూరెన్స్ అనేది రైతులకు, బజాజ్ అలయంజ్ కంపెనీకి సంబంధించిన విషయం. ఇందులో ప్రభుత్వ ప్రమేయం, జోక్యం అవసరం లేదు. రైతులు బ్యాంకులో పంట రుణం తీసుకుంటే కచ్చితంగా బీమా ప్రీమియం చెల్లించాలి. లేదంటే బ్యాంకరు రుణం ఇవ్వడు. అంటే రైతు తీసుకున్న రుణానికి ఇన్సూరెన్స్ చేశారన్న మాట! గత ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వేరుశనగకు ఎకరాపై రూ.19,500 చొప్పున రుణాన్ని మంజూరు చేశారు. ఇందులో పది శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలి. గతేడాది 10 శాతం ప్రీమియంలో రెండు శాతం రైతుల వాటాగా రూ.56 కోట్లు చెల్లించారు. తక్కిన ఎనిమిది శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. ఈ లెక్కన ప్రభుత్వాలు చెల్లించిన ప్రీమియంతో కలిపి రూ.280 కోట్లు బీమా కంపెనీకి దక్కాయి. రైతులు పంట పూర్తిగా నష్టపోయినందున వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్ మొత్తం రూ.2,954 కోట్లు. కానీ బీమా కంపెనీ ఇస్తోంది రూ.419 కోట్లు మాత్రమే. అంటే రైతులకు రూ.2,535 కోట్లు నష్టం వాటిల్లినట్లే! గత ఏడాది రైతులు చెల్లించిన ప్రీమియం, దానికి ఏడాదిగా వడ్డీ లెక్కిస్తే బీమా కంపెనీ అదనంగా చెల్లించేది నామమాత్రమేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వ దగాతో రూ.456 కోట్ల నష్టం ప్రభుత్వ బాధ్యతగా ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032.69 కోట్లను సర్కారు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే వాతావరణ, ఫసల్బీమా ద్వారా వచ్చే పరిహారం మొత్తం రూ.456 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల ఖాతాల్లో వేయాలి. మొత్తంగా రైతులకు రూ.1,488.69 కోట్ల పరిహారం దక్కాలి. ఇన్పుట్ సబ్సిడీలో కేంద్రం వాటా రూ.516 కోట్లు పోనూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు చెల్లించాలి. కానీ రూ.456 కోట్ల బీమా సొమ్మును తానే తీసేసుకుని..దీనికి రూ.60.34 కోట్లను జతచేసి మొత్తం ఇన్పుట్ సబ్సిడీ తానే ఇస్తున్నట్లు అసత్య ప్రకటనలు చేస్తోంది. ప్రభుత్వ దగా కారణంగా రైతులు రూ.456 కోట్ల మేర నష్టపోతున్నారు. కాగా.. పరిహారం డబ్బును వారం తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు కేసులతో అధికారుల్లో వణుకు...చేతులెత్తేసిన బజాజ్ కంపెనీ? ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్కు ముడిపెడితే కోర్టును ఆశ్రయిస్తామని రైతులు హెచ్చరించడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. నిజానికి ప్రభుత్వం, అధికారులు, బీమా కంపెనీ చేస్తోంది తప్పు. బజాజ్ కంపెనీ పరిహారాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలి. కానీ, ఆ మొత్తాన్ని తమకు ఇవ్వాలని కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇచ్చే హక్కు కంపెనీకి లేదు. దీనిపై రైతులు కోర్టుకు వెళితే సంస్థ చిక్కుల్లో పడుతుంది. దీంతో ఈ ఏడాది వాతావరణ బీమా బాధ్యత నుంచి బజాజ్ కంపెనీ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్కు బాధ్యతలు అప్పగించింది. ఏదిఏమైనా పరిహారం పంపిణీ మొదలైన తర్వాత నిర్దిష్టమైన సాక్ష్యాలతో అందరినీ కోర్టుమెట్లు ఎక్కిస్తామని విపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. -
రేపు ఫసల్ బీమాకు చివరి తేది
పెద్దేముల్:- ప్రధాన మంత్రి ఫసల్ బీమాకు నేడు మంగళవారం చివరి తేదీ అని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 31వరకు ఉన్న గడువును ప్రభుత్వం నేటి వరకు పొడిగిందని బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు అధికారులను కలవాలని సూచించారు. పంటపేరు-------ఎరాకు చెల్లించవలసిన ప్రెమియం వరి --- రూ.364 కంది --- రూ.260 పెసర --- రూ.200 మినుము --- రూ.200 మెక్కజోన్న --- రూ.400 పసుపు --- రూ.2740 రూపాయలు అగ్రికల్చరర్ ఇన్స్రెన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరుతో డీడీ రూపంలో మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఏఓకు చెల్లించాలని సూచించారు.