breaking news
English calendar
-
ముందుగానే రంజాన్ ఎందుకిలా.?
సాక్షి సిటీబ్యూరో: ఈసారి రంజాన్ మాసం ముందొచ్చినట్టు అనిపిస్తుంది కదూ! అవును దీనికి ఓ కారణముంది. ఇంగ్లిష్ క్యాలెండర్తో పోలిస్తే... ఇస్లామిక్ క్యాలెండర్లో రోజుల సంఖ్య తక్కువ. అందుకే రంజాన్ ముందుగానే మొదలవుతుంది. గతేడాది రంజాన్ మే 27న ప్రారంభమైంది. ఈసారి ఈ నెల 16న నెలవంక దర్శనమిస్తే... 17న రంజాన్ మొదలవుతుంది. అంటే 12 రోజులు ముందుగానే రంజాన్ ప్రారంభమవుతుందన్న మాట. ఒక్క రంజాన్ మాసమే కాదు... ఇస్లామిక్ క్యాలెండర్లో అన్ని మాసాలు ముందుగానే వస్తాయి. ఎందుకిలా అంటారా? అయితే చరిత్ర తెలుసుకోవాల్సిందే. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా నగరానికి వలస (హిజ్రత్) వెళ్తారు. ఇది ఇస్లామిక్ చరిత్రలో ఓ ఘట్టం. మదీనాకు చేరుకున్న నాటి నుంచే హిజ్రీ క్యాలెండర్ ప్రారంభమైంది. ప్రస్తుతం హిజ్రీ 1439వ సంవత్సరం నడుస్తోంది. ఆంగ్ల సంవత్సరాదిలో ఉన్నట్టే... హిజ్రీ క్యాలెండర్లోనూ 12 నెలలు ఉంటాయి. మొదటి నెల మొహరంతో మొదలై వరుసగా సఫర్, రబ్బీల్ఆవ్వల్, రబీవుల్సానీ, జమాదుల్ఆవ్వల్, జమాదుస్సానీ, రజ్జబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, జీఖద్, జిలహజ్ ఉంటాయి. ఇందులో రంజాన్ తొమ్మిదో నెల. ప్రతి నెలలో తక్కువే... ఇంగ్లిష్ క్యాలెండర్లో ఒక్క ఫిబ్రవరిని మినహాయిస్తే మిగతా నెలల్లో కొన్నింటిలో 30 రోజులు, మరికొన్నింటిలో 31 రోజులు ఉంటాయి. కానీ ఇస్లామిక్ క్యాలెండర్లో అలా ఉండదు. కొన్ని నెలల్లో 29 రోజులు , మరికొన్నింటిలో 30 రోజులు ఉంటాయి. ఏ నెలలోనూ 31 రోజులు ఉండవు. అంటే ఇంగ్లిష్ క్యాలెండర్తో పోలిస్తే ఇస్లామిక్ క్యాలెండర్లో ఏడాదికి 10–12 రోజులు తగ్గిపోతాయి. అందుకే రంజాన్ మాసం 12రోజులు ముందుగానే వస్తోంది. నెలవంక ఆధారంగా... ఆంగ్ల సంవత్సరాది ప్రకారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ ఇస్లామిక్లో అలా కాదు. సూర్యాస్తమయంతో మరుసటి రోజు మొదలవుతుంది. నెలలు కూడా అంతే... నెలవంక చూసిన తర్వాత మరుసటి నెల మొదలవుతుంది. అంటే సాయంత్రం వేళ నెలవంక దర్శమిచ్చిన మరుక్షణం నుంచే ఇస్లామిక్ నెల ప్రారంభమవుతుంది. సాయంత్రం వేళ నెలవంక దర్శనమిచ్చాకే రంజాన్ మాసం ప్రారంభమైందంటూ మసీదుల్లో సైరన్ మోగిస్తారు. -
ఈ నెలలో 5 శుక్ర, శని, ఆదివారాలు
826 ఏళ్లకోసారి జరిగే అరుదైన సంఘటన ఆదిలాబాద్: ఈ ఏడాది ఆగస్టు నెలకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఇంగ్లిష్ క్యాలెండర్ ఏ నెలలోనైనా రెండు వారాలు మాత్రం ఐదుసార్లు వస్తుంటాయి. అయితే, ఈ నెలలో ఐదు శుక్రవారాలు, ఐదు శనివారాలు, ఐదు ఆదివారాలు వస్తున్నాయి. ఇలా 826 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. -
నా జీవితంలో సినిమాలు చూడలేదు
ఆయన వయస్సు ఇంగ్లిష్ కేలెండర్ ప్రకారం వంద సంవత్సరాలు దాటింది. తెలుగు తిధుల ప్రకారం, అధిక మాసాలతో కలుపుకుంటే, మరింత ఎక్కువే ఉంటుంది. అయితే, నేటికీ ఆయన కళ్లజోడు ధరించరు. చేతి కర్ర ఉపయోగించకపోవడమే కాదు, నడిచేటప్పుడు ఎవరినీ ఆయన్ను పట్టుకోనివ్వరు. వినికిడి శక్తి తగ్గలేదు. అంతేకాదు, బీపీ, షుగరు వంటి వ్యాధులు అంటే ఏమిటో ఆయనకు తెలీదు.. నేటికీ తన పనులను తానే స్వయంగా చేసుకుంటున్న మారెళ్ళపూడి సూర్యనారాయణ సాగర సంగ మహేశ్వర శర్మ ఈ జిల్లా పొలిమేరలు దాటి వె ళ్లిన సంఘటనలు చాలా అరుదు. శనివారం సాయంత్రం ఆనం కళాకేంద్రంలో శ్రీహరి సంగీత విభావరి ఆధ్వర్యంలో జరుగనున్న ‘గురుర్దేవో భవ’ సంగీత విభావరి కార్యక్రమంలో సన్మానం అందుకోవడానికి నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన తన జీవన సరళిని, జీవశక్తిని ఇలా వివరించారు... దేవీచౌక్ (రాజమండ్రి) :మాది సామర్లకోట మండలం, జి.మేడపాడు గ్రామం. నేను 1914 జూలై ఏడవ తేదీన తునిలో మాతామహుల ఇంట జన్మించాను. తండ్రి కలికిమూర్తి జి.మేడపాడులో పౌరోహిత్యం చేసేవారు. నా పేరులో సూర్యనారాయణ పేరు ఉండడంతో, నన్ను ఇంట్లో అందరూ భానుమూర్తి అని ముద్దుగా పిలిచేవారు. తునిలో ఎస్సెల్సీ వరకూ చదివాను. రాజమండ్రిలో ఆర్ట్సు కళాశాల చరిత్ర ఉపన్యాసకుడు రాళ్లబండి సుబ్బారావు సౌజన్యంతో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రెయినింగ్ పూర్తిచేశాను. ఆయనే వరదరావు హోటల్లో నాకు భోజనం ఏర్పాటు చేశారు. జి.మేడపాడు, సామర్లకోట, అమలాపురం, జగ్గంపేట, బిక్కవోలు, వేట్లపాలెం, తాళ్లరేవు ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా పనిచేశాను. 1971లో బిక్కవోలులో పదవీ విరమణ చేశాను. నాకు ఇద్దరు కుమారులు, ఒక మనుమడు, ముగ్గురు మనుమరాళ్లు, ముగ్గురు మునిమనుమలు, నలుగురు మునిమనుమరాళ్లు. ఆరోగ్య రహస్యాలు నాకు ఉదయం 9 గంటలకు భోజనం చేయడం అలవాటు. మళ్లీ రాత్రి భోజనం చేస్తాను. మధ్యలో చిరుతిళ్లు ఉండవు. కాఫీ, టీ అలవాటు లేవు. రాత్రి పదింటికి పడుకొని ఉదయం అయిదు గంటలకు మేలుకుంటాను. లేవగానే కొద్దిపాటి వ్యాయామం, దైవధ్యానం చేస్తాను. సంధ్యావందనం, ఆదిత్య హృదయం నేటికీ చేస్తున్నాను. సాయంత్రం విష్ణుసహస్రనామం పారాయణ చేస్తున్నాను. నా జీవితంలో సినిమాలు చూడలేదు. టీవీలంటే నాకు అసహ్యం. వార్తలు వినడానికే టీవీ చూస్తాను. నాకు సైకిల్ ఉండేది. సాత్విక ఆహారంతో శరీరం, మనస్సూ రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన బుద్ధులు ఉంటాయి. నాడు - నేడు నేను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మద్దూరి అన్నపూర్ణయ్య, క్రొవ్విడి లింగరాజు, ప్రకాశం పంతులు వంటి వారిని చూశాను. నాడు చదువుల్లో నైతిక విలువలకు పెద్దపీట వేసేవారు. నేడు అది శూన్యం. నేను 1955 నుంచి హిందూ ధర్మప్రచార కార్యక్రమాన్ని చేపట్టి, శిష్యుల సాయంతో 26 పుస్తకాలను ముద్రించగలిగా. నా వందో పుట్టినరోజున కైవల్యసుధ అనే గ్రంథాన్ని విడుదల చేశాను. ఎన్నో సన్మానాలు అందుకున్నాను. నాకు కోరికలు ఏమీ లేవు. ఆ భగవంతునిలో లీనమయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.