-
రూ.లక్ష కోసం ఆర్టీసీ బస్సును షెడ్కు...
హైదరాబాద్: తెలంగాణా ఆర్టీసీ బస్సు చోరీ ఘటనపై ఈస్ట్జోన్ డీసీపీ రమేష్ శనివారం స్పందించారు. హైదరాబాద్లో డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ..అఫ్జల్ గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోరీకి గురైన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పోలీసులు నాందేడ్లో పట్టుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 24న రాత్రి 12 గంటల 3 నిమిషాలకు బస్సు చోరీ జరిగిందన్నారు. సీబీఎస్ నుంచి తూప్రాన్ మీదుగా బస్సును నాందేడ్ తీసుకెళ్లారని, నాందేడ్కు 10 కిలోమీటర్ల దూరంలో బస్సును నిలిపివేసి బస్సు భాగాలని విడగొట్టారని వివరించారు. బస్సు చోరీ ఘటనలో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. 9 మంది నిందితుల్లో ఏ1, ఏ2లు ఇద్దరూ అన్నదమ్ములు.. వీరు హైదరాబాద్లో పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చారని చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగానే బస్సును గుర్తించామని, లక్ష రూపాయలకు ఒప్పందం చేసుకుని బస్సును షెడ్డుకు తరలించారని పేర్కొన్నారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం రూ.60 వేలు నిందితులు తీసుకున్నారు.. వారి నుంచి రూ.19 వేల 500 తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
పోలీసుల దిగ్బంధనంలో ఉస్మానియా ఆస్పత్రి!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు అనూహ్యంగా శనివారం సాయంత్రం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఏకంగా 100 మంది ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రిని దిగ్బంధనం చేశారు. ఆస్పత్రిలో పలు అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ ఆకస్మిక కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆస్పత్రిలోని రోగులు, వారి సహాయకుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ఇన్సూరెన్స్ బ్రోకర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని రోగులను మాయమాటలతో మోసం చేసే దళారులనూ అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ ఇప్పిస్తామంటూ రోగులను మోసం చేస్తున్న బోకర్ల బాగోతం కార్డాన్ సెర్చ్లో బహిర్గతం అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి. -
దందాలు అక్కడ షరా మామూలే
తూర్పు పోలీస్ జోన్ తీరు ఇదీ. గ్రామాలవారీగా పేకాట శిబిరాలకు కాసుల వాన ప్రతి స్టేషన్లోనూ నెలకు రూ. లక్షల్లో వసూళ్లు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే.. విజయవాడ : గుట్కా, లిక్కర్ సిండికేట్ల నుంచి నెలనెలా లక్షల్లో మామూళ్లు, గ్రామాల వారీగా వీరి కనుసన్నల్లో అధికార పార్టీ ముసుగులో పేకాట శిబిరాలు, ఇక కాల్మనీ కేసులు వస్తే అదనంగా బోనస్ ఆదాయం.. ఇదీ విజ యవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తూర్పు పోలీస్ జోన్లో ఉన్న స్టేషన్ల పరిస్థితి. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో అతి పెద్ద జోన్ ఇది. వారం క్రితం వరకు ఏడు పోలీస్ స్టేషన్లు, సీఐలు ఉండేవారు. జోన్ల పునర్విభజనతో ఇప్పుడు మూడు స్టేషన్లుగా మారి ముగ్గురు సీఐలు ఉన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండడం ఈ జోన్కు కలిసొచ్చే అంశం. దీంతో అక్కడి పోలీ సులు అధికార పార్టీ పేరుతో హడావుడి చేస్తూ.. అడ్డగోలు పంచాయితీలు సాగిస్తూ భారీగా కాసులు కొల్లగొడుతున్నారు. ఫిర్యాదు వస్తే చాలు దాన్ని కాసులుగా ఎలా మలుచుకోవాలో బాగా తెలిసిన సిద్ధహస్తులు అక్కడి అధికారులు. తూర్పు జోన్లో కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు సర్కిళ్లు ఉన్నాయి. అరెస్ట్లపై నిషేధం కమిషనరేట్ పరిధిలోని ఓ సీఐకు నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. వారంలో ఒకటి, రెండు గుట్కా రాకెట్ కేసులు పట్టుకుంటారు. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కానీ గుట్కా విక్రేతల అరెస్ట్లుండవు. ఇక్కడి స్టేషన్లలో గుట్కాలపై కాదు గుట్కా కేసులపై నిషేధం ఉందనేది పోలీసు వర్గాల్లో ఉన్న ప్రచారం. అవినీతి తారస్థాయికి చేరడంతో ఈ స్టేషన్ సీఐను గత వారం బదిలీ చేశారు. గొడవర్రు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మద్దూరు, చోడవరం, రొయ్యూరు, నెప్పల్లిల్లో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. రోజూ రూ.లక్షల్లో ఆడతారు. ఈ క్రమంలో సదరు పేకాట నిర్వాహకుడితో సీఐకి మంచి పరిచయాలు ఉండడంతో అతడు నెలవారీ రూ. లక్షకు పోలీసులనుసెట్ చేసుకున్నాడు. గడిచిన నాలుగు నెలల్లో ఇక్కడ పేకాట భారీ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. లిక్కర్ సిం డికేట్ నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు వస్తాయని తెలిసింది. రెండు నెలల కిందట ఇద్దరు విద్యార్థులు ప్రేమ నేపథ్యంలో ఇంటి నుంచి పారిపోయారు. సీఐ పారిపోయిన విద్యార్థుల స్నేహితులను స్టేషన్కు తీసుకువచ్చి రెండు రోజులు హడావుడి చేశారు. చివరకు కేసును రాజీచేసి రూ.4 లక్షలు నొక్కేశారు. ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. కాల్ మనీలో వాటాలు మరో సర్కిల్లోని పోలీసులు పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యే ముసుగులో ఉంటారు. ప్రతి పనికి ఎమ్మెల్యే సిఫారసు ఉండాలి. ఆయన చెబితే ఎలాంటి కేసు అయినా సెటిల్ చేస్తారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కేసు వస్తే జాగ్రత్తగా పరిశీలించి డబ్బు దండుకుంటారు. బుద్ధవరం, అల్లాపురం, కేసరపల్లి గ్రామాల్లో అధికార పార్టీ నేతల ముసగులో పేకాట శిబి రాలు నిర్వహిస్తున్నారు. శిబిరాల నుంచి నెల వారీ రూ. క్షపైనే సీఐకి వాటా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూడు నెలల కిందట కాల్మనీ కేసుల హడావుడి సమయంలో సర్కిల్ పరిధిలో సుమారు 20 మంది కాల్మనీ వ్యాపారులను స్టేషన్కు రప్పించి నలుగురిపై మాత్రమే కేసులు కట్టారు. వారి నుంచి నామమాత్రంగా స్టేషన్ ఖర్చుల పేరుతో వసూలు చేశారు. మిగిలిన వారి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల లోపు వసూలుచేసినట్లు ఆరోపణలున్నాయి. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్లో భారీగా దండుకుంటారు. మేడమ్ పవర్ఫుల్.. ఇక్కడ సారే కాదు మేడమ్ కూడా పవర్ఫుల్లే అనే పేరుంది. కొన్ని కేసుల్ని మేడమ్ ప్రత్యేకంగా డీల్ చేసి సెటిల్ చేస్తుంటారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జరుగుతోంది. సార్ స్టేషన్ పరిధిలోని నెలావారీ మామూళ్లతో పాటు కేసుల్ని డీల్ చేస్తుంటే మేడమ్ వారి బంధువులు, ఇతర సిఫారసులతో వచ్చిన కేసుల్ని సార్ దృష్టికి తీసుకెళ్లి సెటిల్ చేస్తారు. ముఖ్యం గా ఎమ్మెల్యేకు సదరు సీఐ అత్యంత సన్నిహితులు కావడం కలిసొచ్చే అంశం. స్టేషన్ పరి ధిలో గండిగుంట, చినఓగిరాల, ముద్దునూరు, కాటూరు, ఆకునూరులో ఇళ్లలోనే పేకాట శిబి రాలు పోలీసుల కనుసన్నల్లో సాగుతున్నాయి. వీరి నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు ముడతాయని వినికిడి. వీటి వసూళ్లకు ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రత్యేకంగా విధుల్లో ఉంటారు. లిక్కర్ సిండికేట్ నుంచి నెలకు రూ.లక్ష మామూలు వస్తుందట. గతంలో సదరు సీఐ బదిలీకి రంగం సిద్ధంవగా స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో వాయిదా పడింది. -
సుల్తాన్ బజార్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్: దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని సుల్తాన్ బజార్ లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగనోట్లు చెలామణి చేస్తున్నారనే ఫిర్యాదు అందుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.30 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement