breaking news
Dutch Open Grand Prix badminton tournament
-
సెమీస్లో సిక్కి రెడ్డి జంట
అల్మెరె (నెదర్లాండ్స): డచ్ ఓపెన్ గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-10, 10-21, 21-17తో రోనన్ లాబెర్-ఆడ్రీ ఫొంటెరుున్ (ఫ్రాన్స) జంటపై గెలిచింది. మరోవైపు సుమీత్ రెడ్డి-జక్కంపూడి మేఘన జోడీకి పరాజయం ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సుమీత్-మేఘన జంట 7-21, 10-21తో మార్విన్ ఎమిల్ సిడెల్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
గురుసాయిదత్ శుభారంభం
అల్మెరె (నెదర్లాండ్స్): డచ్ ఓపెన్ గ్రాండ్ప్రి బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు గురుసాయిదత్, సాయిప్రణీత్లతోపాటు డిఫెండిం గ్ చాంపియన్ అజయ్ జయరామ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్ గురుసాయిదత్ 21-8, 21-9తో మాక్సిమి మోరీల్స్ (బెల్జియం)పై గెలుపొందాడు. నాలుగో సీడ్ సాయిప్రణీత్ 21-15, 21-11తో స్టీఫెన్ రస్ముసేన్ (డెన్మార్క్)పై... జయరామ్ 19-21, 21-17, 21-18తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. అయితే భారత్కే చెందిన ఆనంద్ పవార్ 10-21, 15-21తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ (భారత్) ద్వయం 16-21, 15-21తో జాకో అరెండ్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది.