-
అమరావతి టీడీపీలో ముసలం
తాడికొండ: అమరావతి తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పదవుల పందేరంలో భగ్గుమన్న అసంతృప్తులు పార్టీ పదవుల రాజీనామాకు దారితీశాయి. అమరావతి దళిత జేఏసీలో పనిచేస్తున్న కంభంపాటి శిరీషకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి కేటాయించడంతో భగ్గుమన్న దళిత జేఏసీ సభ్యులు శుక్రవారం రాజీనామా చేసినప్పటికీ అధిష్టానం స్పందించలేదు. దీంతో ఆ సెగ తాజాగా పార్టీకి అంటుకుంది. తుళ్లూరులో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన టీడీపీ మండల అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు అధినేత వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మండల ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు షేక్ సాహెబ్ జాన్, తెలుగు యువత అధ్యక్షుడు జే తేజ్ మొహంత్, మహిళా అధ్యక్షురాలు కే నాగమల్లేశ్వరి, మహిళా ప్రధాన కార్యదర్శి డి. చంద్రకళ, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి పారా నాగేశ్వరరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఎస్టీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వరా? ఈ సందర్భంగా ధనేకుల మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవులు ఇవ్వకుండా పనిచేయని వారికి రాష్ట్ర పార్టీ నాయకులు పదవులు కేటాయించడం తమకు ఆవేదన కలిగించిందన్నారు. కిందిస్థాయి నుంచి పనిచేసిన తమకు ప్రాధ్యాన్యత లేకుండా నేరుగా పార్టీ కార్యాలయంలో పదవులు కేటాయించడం మంచి పద్ధతి కాదని.. అలాగే, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్కు, పార్టీ మండల అధ్యక్షుడు అయిన తనకు తెలియకుండా పదవులు ఇవ్వడంపై మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కోవర్టులుగా పనిచేస్తున్న వారు పార్టీలో పనిచేయని వారిని ప్రోత్సహిస్తూ పార్టీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాజ«ధానిలో అమరావతి పేరిట కొనసాగుతున్న దీక్షలలో టీడీపీ నాయకులే కీలకంగా వ్యవహరిస్తుండగా వీరంతా మాకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడటంతో పార్టీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అమరావతి ఉద్యమానికి ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోందంటూ టీడీపీలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. -
రేపు తెలంగాణ బంద్కు దళిత జేఏసీ పిలుపు
నాగోలు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. దళిత సంఘ నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రోహిత్ మృతికి ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపులే కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల జేఏసీ ఛైర్మన్ ఈదుల పరశురాం, నాయకులు శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement