-
ఈ నెల 30 నుంచి‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’ కార్యక్రమంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ జాతీయ ప్రోగ్రామింగ్ సదస్సుకు సీవీఆర్ కళాశాల మరోసారి ఆథిత్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ సీవీ రాఘవ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మార్చి 30న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏ.ఐ.సీ.టీ.ఈ) చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్దే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీవీఆర్ కళాశాల సేవలను గుర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కేంద్ర మానవ వనరుల శాఖలు ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ నిర్వహణకు రెండోసారి అవకాశం కల్పించాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 28 నోడల్ సెంటర్లలో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొంటున్న 40 విద్యార్థి బృందాలకు సదుపాయాలు కల్పిస్తామని సీవీ రాఘవ వెల్లడించారు. గత ప్రోగ్రామింగ్ సదస్సులో దివ్యాంగ సంక్షేమ శాఖకు సాఫ్ట్వేర్, దివ్యాంగులకు అసరమైన పరికరాలను రూపొందించమన్నారు. ఈ ఏడాది కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అవసరమైన నమూనా పరిష్కారాలను హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను అందించనున్నామని తెలిపారు. పోటీలో ప్రతిభ కనబర్చిన వారికి 31వ తేదీ సాయంత్రం బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో, మూడో బహుమతిగా 75 వేలు, 50 వేల రూపాలయలు అందిస్తామని అన్నారు. సీవీఆర్ కళాశాల గతేడాది మాదిరిగానే రెండు జట్లకు రూ.25,000 ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని పేర్కొన్నారు. -
సీవీఆర్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
హైదరాబాద్: కేంద్ర మానవ వనరుల శాఖ, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2017 జాతీయ స్థాయి ప్రోగ్రామింగ్ సదస్సుకు నగరంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వేదిక కానుంది. కేంద్రం స్టార్ట్ అప్ ఇండియా- స్టాండ్ అప్ ఇండియా అనే నినాదంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఈ సామూహిక సదస్సును ఏప్రిల్ 1,2 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, కళాశాల సౌకర్యాల ఆధారంగా నోడల్ సెంటర్లును ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికయింది. ఈ సదస్సులో ఒక్కో సెంటర్ నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలకు తలెత్తిన సమస్యలను విద్యార్థులు తమ సాంకేతిక పరిజా్ఞనంతో పరిష్కారాన్ని అందించనున్నారు. జాతీయ దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించే సెంటర్గా సీవీఆర్ ఎంపికయింది. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని ప్రోగ్రామింగ్ రూపొందించనున్నారు. ఈ సాఫ్ట్వేర్ దివ్యాంగులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంజూరు చేసే ఉపకార వేతనాలు అర్హులకు అందే విధంగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 2 సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం కోనసాగుతుంది. కార్యక్రమ అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందజేశాస్తారు. దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసే సదస్సుకు తమ సంస్థ వేదిక కావడం సంతోషంగా ఉందని సీవీఆర్ యాజమాన్యం తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement