-
కీబోర్డును మడిచి జేబులో పెట్టుకోవచ్చు!
సియోల్: దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సరికొత్త కీబోర్డును తయారు చేశారు. మడతపెట్టి జేబులో పెట్టుకునే విధంగా తయారైన ఈ కీబోర్డును ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్టాప్లకు అనుసంధానం చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తతం మార్కెట్ పలు రకాల కీబోర్డులు ఉన్నాయి. వాటిలో చాపలా చుట్టి వెంట తీసుకెళ్లగలిగేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు సౌత్ కొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కీబోర్డును ఎలాగైనా మడతపెట్టవచ్చు. ఈ కీబోర్డు కోసం శాస్త్రవేత్తలు మొదట ఓ సెన్సర్ షీట్ను తయారు చేశారు. అనంతరం దానిపై సిలికాన్ రబ్బర్తో చేసిన మరో షీట్ను అమర్చారు. ఈ రెండిటి మధ్య కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్ను అనుసంధానించారు. రబ్బర్ షీట్ పైభాగంలో కీబోర్డ్లోని బటన్స్ను సూచించేలా గడులు గీశారు. దీంతో ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని సూచిస్తుంది. మనం టైప్ చేసినప్పుడు వేళ్ల ద్వారా కలిగే ఒత్తిడి రబ్బర్షీట్ ద్వారా నానోట్యూబ్స్పై పడి అడుగున ఉన్న సెన్సర్ షీట్కు తగులుతుంది. అప్పుడు సెన్సార్లు ఏ అక్షరాన్ని టైప్ చేశామో గుర్తించి కంప్యూటర్కు పంపుతుంది. ఈ కీబోర్డ్ మిగతా కీబోర్డుల్లాగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక కీబోర్డును తయారు చేయడానికి కేవలం ఒక డాలర్ మాత్రమే ఖర్చవుతుందన్నారు. -
అల్లుడిని చూసేందుకు వచ్చి దుర్మరణం
నిజామాబాద్ క్రైం: అనారోగ్యానికి గురైన అల్లుడిని చూసేందుకు వచ్చిన అత్తను వేగంగా దూసుకొచ్చిన లారీ చిదిమేసింది. ఈ ఘటన ఒకటో టౌన్ ఠాణా పరిధిలోని అర్సపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్హెచ్వో రవీందర్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం కుంట గల్లీకి చెందిన సాబేరా బేగం (60) కూతురు నిజామాబాద్ ఆటోనగర్లో ఉంటోంది. అల్లుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసేందుకని సాజీరాబేగం ఆదివారం భైంసా నుంచి బస్సులో బయల్దేరింది. అర్సపల్లికి రాగానే ఆమె బస్సు దిగింది. అయితే, బస్సు వెనుకాలే ఉన్న లారీ (ఎంహెచ్ 26 ఏడీ 0878) అర్సపల్లి బైపాస్ వైపు వెళ్లేందుకు మలిగింది. ఈ క్రమంలో అది గమనించని సాజీరా బేగం లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. తల పగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు లారీని ధ్వంసం చేసేందుకు యత్నించగా, అక్కడే వన్టౌన్ పోలీసు బూత్ సిబ్బంది వారిని నిలువరించారు. లారీ డ్రైవర్ సాయినాథ్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మృతురాలి వద్ద లభించిన ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా ఆటోనగర్లో ఉంటున్న మనువడు షేక్ జావేద్కు సమాచారమిచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ అక్కడకు చేరుకున్నారు. ఎస్సై తలాలిక్ ఖాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement