-
విచారణ లేకుండా ఉద్యోగస్తుల తొలగింపా?
ఉద్యోగుల్ని తొలగిస్తూ సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారంటూ ప్రొబేషన్లో ఉన్న పలువురు జూనియర్ పత్తి కొనుగోలుదారులను తొలగిస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. తొలగించిన జూనియర్ పత్తి కొనుగోలుదారులను ఆ పోస్టుల్లోకి వెంటనే తీసుకోవాలని సీసీఐని ఆదేశించింది. తొలగించిన నాటి నుంచి విధుల్లోకి తిరిగి తీసుకునేంత వరకు వారికి చెల్లించాల్సిన జీతభత్యాలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. శాఖాపరమైన విచారణ జరపకుండానే ఆ ఉద్యోగులను తప్పించడం సరికాదంది. అయితే వారిపై అభియోగాలు నమోదు చేసి, శాఖాపరమైన విచారణ జరిపి, దోషులుగా తేలితే తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. అందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. -
‘ప్రత్తి’పాపం మాఫీయేనా?
♦ సీఎంకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు ♦ గుంటూరు జిల్లాలో రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసిన ‘కీలక’ మంత్రి! ♦ బోగస్ రైతుల పేర్లతో సీసీఐకి అధిక ధరలకు విక్రయం ♦ 47,903.91 క్వింటాళ్లు బోగస్ రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ ♦ సీసీఐ మేనేజర్పై బదిలీ వేటు వేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల కడుపు కొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కీలక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దన్నుగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లాలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించిన పత్తిలో.. 80 శాతం పత్తిని బోగస్ రైతుల నుంచే కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సీబీఐ దర్యాప్తులో సైతం ఇదే వెల్లడైంది. విజిలెన్స్, సీబీఐ నివేదికల ఆధారంగా సీసీఐ మేనేజర్ ఆర్.జయకుమార్పై కేంద్రం బదిలీ వేటు వేసింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి, కుంభకోణానికి సూత్రధారి అయిన కీలక మంత్రికి బాసటగా నిలుస్తున్నారు. గతేడాది పత్తికి క్వింటాలుకు మొదటి రకానికి రూ.4050, రెండో రకానికి రూ.3750ను కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)గా కేంద్రం నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేసేందుకు దేశవ్యాప్తంగా సీసీఐని రంగంలోకి దించింది. గుంటూరు జిల్లాలో జిన్నింగ్ పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకున్న ఓ కీలక మంత్రి, సీసీఐ అధికారులతో కుమ్మక్కయ్యారు. మార్కెట్ యార్డుల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయకుండా చేసిన కీలక మంత్రి దళారీల ద్వారా తక్కువ ధరలకే రైతుల నుంచి పత్తిని ఖరీదు చేశారు. అదే పత్తిని ఎమ్మెస్పీ ధరలకు సీసీఐకి విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. విజిలెన్స్ విచారణలో రట్టు గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలపర్వంపై రైతు సంఘాలు ఉద్యమించాయి. సీబీఐతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ అక్రమాలపై దర్యాప్తు చేసింది. సీసీఐ పత్తి కొనుగోలు చేసిన రైతులను విజిలెన్స్ అధికారులు విచారించారు. 900 మంది రైతులను విచారిస్తే.. ఇందు లో 719 మంది రైతులు బోగస్గా తేలింది. 719 మంది రైతుల నుంచి 47,903.91 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు సీసీఐ అధికారులు రికార్డులు సృష్టించారు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నిం గ్ మిల్లులకు పంపి ప్రాసెసింగ్ చేయిస్తుంది. ఇందు కు సంబంధించిన రికార్డులు జిన్నింగ్ మిల్లుల వద్ద లేవన్నది విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి సేకరించిందేనని విజిలెన్స్ నిర్ధారించింది. సీసీఐ అధికారులతో కలిసి ఓ కీలక మంత్రి రూ.75 కోట్లకుపైగా కొల్లగొట్టినట్లు సీబీఐ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీబీఐ ప్రాథమిక నివేదికతోపాటూ విజిలెన్స్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. సీసీఐ మేనేజర్ జయకుమార్తోపాటూ ముగ్గురు బయ్యర్లపై బదిలీ వేటు వేసింది. సూత్రధారికి అభయం! విజిలెన్స్ నివేదికలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షించారు. పత్తి కుంభకోణంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై దృష్టి సారించకపోవడం గమనార్హం. విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకుంటే.. కీలక మంత్రిపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది. ఇది రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుందని సీఎం ఆందోళన చెందుతుండటం, కీలక మంత్రి తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో నివేదికను బుట్టదాఖలు చేసినట్లు అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం దన్నుగా నిలుస్తోండటంతో ఈ ఏడాదీ సీసీఐ అధికారులతో కలిసి పత్తి రైతులను లూటీ చేయడానికి ఆ కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. -
యుద్ధ ప్రాతిపదికన పత్తి కొనండి
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తక్షణమే అన్ని చోట్లా ప్రారంభించి, యుద్ధ ప్రాతి పదికన పత్తిని కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలసి ఆయన సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, సీసీఐ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 84 కేంద్రాలకు గాను సీసీఐ ఇప్పటి వరకు 62 కేంద్రాలు ఏర్పాటు చేసి 24 చోట్ల మాత్రమే పత్తి కొనుగోలు చేస్తోందన్నారు. వెంటనే అన్ని కేంద్రాల్లో సిబ్బందిని నియమించడతో పాటు, ఉదయం ఆరు గంటల నుంచే సీసీఐ సిబ్బంది కొనుగోలు ప్రారంభించాలన్నారు. వారంలో ఐదు రోజుల పాటు సీసీఐ, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ విజ్ఞప్తి మేరకు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్ద తూకం యంత్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. అయితే పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి తగినంత సహకారం అందడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కాగా, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు, మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలుపై మంత్రులు హరీశ్, ఈటల సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్శాఖ డెరైక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయండి
సీసీఐ సీఎండీ బీకే మిశ్రాకు మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు గత ఏడాది ఏర్పాటు చేసిన 83 కేంద్రాలతో పాటు అదనంగా మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారులకు మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. సంస్థ వరంగల్, ఆదిలాబాద్ జనరల్ మేనేజర్లు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్ సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్ పది నుంచి 30వ తేదీలోపు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ఏడాది పత్తి కొనుగోలు సందర్భంగా ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెటింగ్ శాఖ తరఫున సిబ్బందిని నియమించి, కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలన్నారు. జిల్లాలవారీగా పత్తి రైతులను గుర్తించి, వారి వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన పత్తికి 48 గంటల లోపు రైతుల ఖాతాలోకి ఆన్లైన్లో డబ్బులు జమ చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందు హమాలీలతో సమావేశాలు నిర్వహించాలని, సీసీఐ అధికారులతో కలసి తూకపు యంత్రాలు, మౌలిక సౌకర్యాలను పరిశీలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి తక్కువ వుండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై మార్కెటింగ్ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కేంద్రం పత్తికి రూ.4,100 కనీస మద్దతుధర ప్రకటించిందని సీసీఐ సీఎండీ బీకే మిశ్రా వెల్లడించారు. -
పత్తి బేళ్లకు రెక్కలు!
♦ సీసీఐ గోడౌన్ నుంచి రూ.50 లక్షల విలువైన పత్తి మాయం! ♦ రైతుల పేర్లతో దళారీలు, పారిశ్రామికవేత్తల దోపిడీ ♦ రవాణా చార్జీలు కూడా బొక్కేసిన బయ్యర్లు ♦ వ్యవసాయ మంత్రి ఇలాకాలో మాయాజాలం చిలకలూరిపేట : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోదాము నుంచి భారీ మొత్తంలో పత్తి బేళ్లు మాయమైన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకాలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన సీసీఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దళారీలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. తాజాగా రూ.50 లక్షల విలువైన పత్తి బేళ్లు మాయమైన విషయం బయటపడటంతో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. కుంభకోణం జరిగింది ఇలా.. ఈ ఏడాది ఇతర దేశాల నుంచి ఆర్డర్లు లేకపోవటంతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదు. పెద్దమొత్తంలో పత్తిని దిగుమతి చేసుకొనే చైనా కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవటంతో ధర పతనమైంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. క్వింటా పత్తికి రూ.4,050 మద్దతు ధర ప్రకటించి రాష్ట్రంలోని వివిధ మార్కెట్ యార్డుల్లో 43 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మార్కెట్ యార్డులో సవాలక్ష కారణాలతో వేధించే బయ్యర్లకు భయపడిన రైతులు ఎప్పట్లాగే ఈసారి కూడా వ్యాపారులు, దళారులకే అమ్మారు. రైతులకు క్వింటాకు రూ.3,500 వరకు చెల్లించిన దళారులు, వ్యాపారులు అదే పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.4,050కు విక్రయించి భారీగా లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో సీసీఐ అధికారులు వారికి పూర్తి సహకారం అందజేసి తమ వంతు వాటా పొందారని సమాచారం. దీంతోపాటు రవాణా చార్జీలు చెల్లించినట్టు చూపి ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్టు తెలిసింది. ఇదో రకం దోపిడీ.. నవంబరులో ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రా లు రైతుల ఆదరణ లేక బోసిపోయాయి. కాని రికార్డుల్లో మాత్రం కోనుగోలు కేంద్రంలో వేలు క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్లు నమోదు చేశారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని నేరుగా వ్యాపారులు జన్నింగ్ మిల్లులకు తరలించారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు చేర్చటానికి రవాణా చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాని ఇక్కడ జరిగింది వేరు. సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. రైతుల నుంచి నేరుగా మిల్లులకు పత్తి తరలి పోవటంతో ఇక్కడ రవాణా చార్జీలు ఉండవని తెలిసింది. బయ్యర్లు మాత్రమే రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మాయమైన లారీ మాటేమిటి...? ఈ ఏడాది రెండు నెల కిందట యడ్లపాడు మండలంలో జిన్నింగ్ అనంతరం తరలింపునకు సిద్ధంగా ఉన్న ఓ గోడన్ నుంచి కొన్ని ప్రెస్సింగ్ బేళ్లు మాయమయ్యా యి. వే బిల్లులు, లారీ నంబర్లు తారుమారు చేసి గుర్తుతెలియని వ్యక్తులు రెండు లారీల్లో ప్రెస్సింగ్ బేళ్లు తరలించారు. ఈ సంగతి గోప్యంగా ఉంచిన అధికారులు విచారణ చేపట్టినా ఇంతవరకు ఆచూకీ తేల్చలేకపోయారు. అనంతరం ఈ విషయంపై యడ్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని యడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరావు కూడా ధ్రువీకరించారు. కాగా ఆ రెండు లారీల్లో గోడౌన్ నుంచి తీసుకువెళ్లిన పత్తిబేళ్లను గణపవరం లోని ఒక పారిశ్రామిక వేత్తకు విక్రయించినట్టు సమాచారం. పారిశ్రామికవేత్త, సీసీఐ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీ స్స్టేషన్లో పంచాయితీ నిర్వహించగా ఎటువంటి కేసులు లేకుండా పత్తిబేళ్లను తిరిగి ఇచ్చేందుకు ఒప్పం దం జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసుల ను సాక్షి వివరణ కోరగా పత్తిబేళ్లు పోయినట్లు తమకు సమాచారం అందలేదని చిలకలూరిపేట రూరల్ సీఐ తెలపటం విశేషం. కాగా జరిగిన అవినీతి దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’
జోరుగా బీజేడీ ప్రచారం
30 కిలోల గంజాయి స్వాధీనం
కింగ్కోబ్రా హల్చల్
సొంతగూటికి కాశీనగర్ ఎన్ఏసీ చైర్పర్సన్ సుధారాణి
పూరీ కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
కొట్పాడ్లో త్రిముఖ పోటీ!
కుంద్రా సమితిలో ఫ్లాగ్ మార్చ్
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement