చిత్రలేఖనంలో బంగారు పతకం
తణుకు : ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో పట్టణానికి చెందిన రాయసం రాజ్యలక్ష్మి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థి గంటా వెనీషా శ్రీ తన్మయ బంగారు పతకం సాధించింది. క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించినట్టు ప్రిన్సిపాల్ భమిడి కమలాదేవి తెలిపారు. విద్యార్థికి శిక్షణ ఇచ్చిన అధ్యాపకురాలు సీహెచ్వైఎన్ లక్ష్మి, విద్యార్థినిని ప్రిన్సిపాల్ తదితరులు అభినందించారు.