breaking news
CM YSR
-
వైఎస్సార్ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
సింగూరు జలాలు.. వైఎస్ఆర్ పుణ్యమే
2006లో కాలువ పనులకు శంకుస్థాపన రూ.89.98 కోట్లు కేటాయించిన ఘనత జోగిపేట: సింగూరు జలాలను కాలువల ద్వారా వేలాది ఎకరాలకు అందించేందుకు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకుగాను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు. రూ.89.98 కోట్లు మంజూరు చేయించారు. 2006 జూన్ 7న పుల్కల్ మండలం సింగూరుకు స్వయంగా వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు. కాలువల నిర్మాణం ద్వారా 40 వేల ఎకరాలకు నీరు అందించేందుకు పథకాన్ని అప్పట్లో రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో పనుల్లో జాప్యం జరిగింది. 2013లో సింగూరు ద్వారా అందోలు పెద్ద చెరువులోకి సింగూరు నీటిని తరలించడంతో సుమారు 20 గ్రామాల చెరువులకు నీరు చేరింది. దీనివల్ల వందల ఎకరాల్లో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అందోలు నియోజకవర్గానికి నీరందించాలన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం ఇప్పుడిప్పుడే నెరవేరుతుంది. ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ రాజన్నను గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ వల్లే సాధ్యమైంది సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరందిస్తామని దాదాపు 30 ఏళ్లుగా ఎంతో మంది సీఎంలు హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని చెప్పేవారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన ఏడాది తర్వాత కాలువల నిర్మాణానికి రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా వచ్చి పనులు కూడా ప్రారంభించారు. ఆయన తర్వాత వచ్చిన వారు కాలువల పనులను పూర్తి చేయలేకపోయారు. సింగూరు నీటిపైనే ఈ ప్రాంత రైతులు ఆధార పడి ఉన్నారు. అటువంటి మహానేతను పోలిన నాయకులు భవిష్యత్తులో వచ్చే పరిస్థితిలేదు. ఆయనే బతికి ఉంటే ఇప్పటికే కాలువల పని పూర్తయ్యేది. - ముస్లాపురం భాగయ్య, రైతు, పోసానిపేట, మం: అందోల్