breaking news
chilamatthur
-
బాలకృష్ణ నామినేషన్కు వస్తే రూ.400 ఇస్తాం..!
సాక్షి, చిలమత్తూరు: టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నేడు(శుక్రవారం) నామినేషన్ వేయనున్నారు. నామినేషన్కు అవసరమైన జనసమీకరణ కోసం మండలంలోని నాయకులు తలమునకలవుతూ నానా తంటాలు పడుతున్నట్లు స్థానికులు చర్చించుకోవడం విశేషం. నామినేషన్కు ప్రజలను తరలించడం కోసం ఒక్కొక్కరికి రూ.400 వరకు ఇస్తున్నట్లు సమాచారం. టీడీపీ నాయకులు ప్రజలను తరలించేందుకు పలు గ్రామాల్లో తిరగినట్లు ప్రజలు చెబుతున్నారు. జనం వచ్చేలా చూడాలని నియోజకవర్గపు నాయకులు స్థానిక మండల నాయకులకు పనులు అప్పగించిన్నట్లు మండలంలో హాట్ టాపిక్గా మారింది. గురువారం చిలమత్తూరులో నరసింహ స్వామి రథోత్సవంలో కూడా బాలయ్యను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. జనసమీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించమని ఎమ్మెల్యే... నాయకులకు హుకుం జారీ చేసిన్నట్లు సొంత పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. -
అగ్నిప్రమాదంలో వృద్ధురాలి మృతి
చిలమత్తూరు: మండలంలోని మరవకొత్తపల్లిలో లక్ష్మీనరసమ్మ(73) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంట్లో విద్యుత్ లేకపోవడంతో దీపాన్ని వెలిగించి తల వద్ద పెట్టుకుని నిద్రపోయిందన్నారు. ప్రమాదవశాత్తు దీపం నుంచి మంటలు వ్యాపించి ఆమె తల, శరీరం కాలిపోయిందన్నారు. వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.