breaking news
chaganla narendranath
-
తూర్పు అటు... చాగండ్ల ఇటు!
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ నాయకుల వలసలు ఊపందుకున్నాయి. నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. చివరి నిమిషంలో పార్టీ మారి తూర్పు జయప్రకాష్ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పార్టీ మారిమారగానే ఎంపీ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనకు బీజేపీ 'టిక్కెట్'తో స్వాగతం పలికింది. జగ్గారెడ్డి ఇచ్చిన షాకుతో బీజేపీ నాయకులు కారు ఎక్కారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన చాంగడ్ల నరేంద్రనాథ్- గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీరియర్ నేత ఫరీదుద్దీన్, స్వామిచరణ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. -
బీజేపీ గూటికి ‘చాగన్ల’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ నాయకుడు చాగన్ల నరేంద్రనాథ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ నరేంద్రనాథ్కు పార్టీ కండువాను కప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి కలిసితో నరేంద్రనాథ్ దంపతులు మంగళవారం ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామనే రాజ్నాథ్ హామీ మేరకు నరేంద్రనాథ్ బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో మెదక్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో నరేంద్రనాథ్ ఉన్నారు. పార్టీ జాతీయ నాయకులు ఈ సభకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో నరేంద్రనాథ్ 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మెదక్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయాలకు కొత్త అయిన నరేంద్రనాథ్ స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి చేతిలో ఓటమి పాలయ్యారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ జిల్లా నేతలు నరేంద్రనాథ్తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే నరేంద్రనాథ్ బీజేపీ గూటికి చేరారు. -
హలో.. నేను నరేంద్రనాథ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. ఓటేసి గెలిపించండి అంటూ రాజకీయ నాయకులు మెసేజ్ల ద్వారా వేడుకోవడం పరిపాటి. కానీ నరేంద్రనాథ్ చేస్తున్న వెరైటీ ప్రయత్నం చర్చనీయాంశమైంది. నమస్తే... నా పేరు చాగన్ల నరేంద్రనాథ్.. ఎంపీ అభ్యర్థిని. మీరు నన్ను ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటారు. మీ నిర్ణయాన్ని .... నంబరుకు ఎస్ఎంఎస్ చేయండి.. అంటూ మెదక్ జిల్లావాసుల సెల్ఫోన్లో మెసేజ్ హల్చల్ చేస్తోంది. కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ‘సదరు నేత ఏ పార్టీలో చేరాలో జనం చెప్పినంత మాత్రాన వెంటనే చేర్చుకుని టికెట్ ఇవ్వాలా’ అంటూ ఎకసక్కాలాడుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసిన చాగన్ల నరేంద్రనాథ్ 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాజకీయ అనుభవం లేకుండానే రాజకీయరంగ ప్రవేశం చేసిన నరేంద్రనాథ్ను ఓటమి తర్వాత పార్టీలో పట్టించుకునే వారే కరువ య్యారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నేతలెవరూ తనను దగ్గరికి రానివ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వాపోయాడు కూడా. సొంత ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు చేపడుతూ జనంలో తిరుగుతున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కదనే ఆందోళనలో నరేంద్రనాథ్ వున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో మరోమారు మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే పట్టుదలతో వున్నారు. గతంలో టీడీపీ, టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానం ఉందని నరేంద్రనాథ్ చెప్పినా, కాంగ్రెస్లోనే కొనసాగుతూ వచ్చారు. తాజాగా బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. అగ్రనేతల సమక్షంలో త్వరలో నరేంద్రనాథ్ బీజేపీలో చేరతారని, మెదక్ ఎంపీ అభ్యర్థిగా అతడినే నిర్ణయించామంటూ కమలం పార్టీ నేతలు అప్పుడే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈలోగా నరేంద్రనాథ్ మనసులో ఏ అనుమానం తలెత్తిందో తెలియదు కానీ, ఆయన తరఫున జనం సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు అందడం మొదలైంది. తాను ఏ పార్టీలో చేరాలో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలను ఆప్షన్లుగా పేర్కొంటూ ఎస్ఎంఎస్ ఇవ్వాల్సిందిగా నరేంద్రనాథ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదేం ప్రయత్నం? సాధారణంగా ప్రతీ పార్టీకి ఓ సిద్ధాంతం అంటూ ఉంటుంది. సదరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తారు. కానీ పదవి దక్కాలంటే ఏ పార్టీలో చేరితో బాగుంటుందో చెప్పాలని ప్రజలనే అడగటం ఏంటని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక వేళ జనం ఫలానా పార్టీలో చేరమని సూచిస్తే సదరు పార్టీ స్పందించాలనే రూలేమైనా ఉందా. ఇన్నాళ్లూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జెండాలు మోసిన వారికి అవకాశం ఇవ్వకుండా జనం చెప్పారని పదవుల కోసం వచ్చే వారికి టికెట్లు ఇస్తారా అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. తాను ఏ పార్టీలో చేరాలో సర్వే చేయించుకుంటున్న నాయకుడు ఈవీఎంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘నోటా’(పైవేవీ కావు) అనే ఆప్షన్ కూడా ఇచ్చి వుంటే బాగుండేదని ప్రత్యర్థులు హాస్యోక్తులు విసురుతున్నారు. ‘ఓటమి పాలైనా నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం ఖాయం. కాకపోతే ఏ పార్టీ నుంచి నరేంద్రనాథ్ పోటీ చేయాలని జనం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం’ అంటూ ఆయన వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.