breaking news
Bullying phones
-
ఇఫ్తార్ అతిథులకు పాక్ వేధింపులు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పాక్ రాజకీయ, వాణిజ్య, మీడియా ప్రముఖులు రాకుండా నానా అడ్డంకులు సృష్టించింది. ఈ విందుకు వెళ్లరాదని పలువురు ప్రముఖులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వెళ్లాయి. అయినాసరే లెక్కచేయకుండా హాజరైన అతిథుల్ని పోలీసులు, భద్రతాధికారులు తనిఖీల పేరుతో తీవ్రంగా వేధించారు. పలువురు తమ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్లోని భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్లోని సెరేనా హోటల్లో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఇందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సహా పలువురిని ఆహ్వానించారు. కానీ ఈ విందుకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. ఆ హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించిన ప్రభుత్వం, అతిథుల్ని వేధింపులకు గురిచేసింది. ఫోన్చేసి బెదిరింపులు.. ఈ విషయమై ప్రముఖ పాక్ జర్నలిస్ట్ మెహ్రీన్ జెహ్రా మాలిక్ మాట్లాడుతూ..‘మొదటగా నా ఆహ్వానపత్రికను పోలీసులు తనిఖీ చేశారు. నా వృత్తి, నివాసం ఉండే చోటు అడిగారు. చివరికి లోపలకు అనుమతించారు. కానీ నా డ్రైవర్తో దురుసుగా ప్రవర్తించారు. సెరేనా హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. వారంతా హోటల్కు వచ్చేవారిని వేధిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫైసలాబాద్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, లాహోర్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు పాక్ భద్రతాధికారులు గుర్తుతెలియని నంబర్ల నుంచి శుక్రవారం రాత్రి ఫోన్ చేశారు. భారత హైకమిషన్ ఇస్తున్న విందుకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ ఘటనను పాక్ మీడియా కవర్ చేయలేదు. పాక్ నేతకు చుక్కలు.. ఈ విందుకు హాజరైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత ఫర్హతుల్లాహ్ బాబర్కు పాక్ అధికారులు చుక్కలు చూపించారు. ‘‘నేను సెరేనా హోటల్కు రాగానే బారికేడ్లు దర్శనమిచ్చాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లగా భద్రతాధికారులు ఇఫ్తార్ రద్దయిందని చెప్పారు. గట్టిగా అడిగేసరికి మరో గేటు నుంచి లోపలకు వెళ్లాలన్నారు. అటుగా వెళితే.. ఇటువైపు రావొద్దు. ముందువైపు గేటు నుంచే హోటల్లోకి వెళ్లండని ఇబ్బంది పెట్టారు’ అని బాబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పిన బిసారియా.. ఇఫ్తార్ విందు సందర్భంగా వేధింపులకు గురైన ప్రముఖులకు భారత రాయబారి అజయ్ బిసారియా క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు కరాచీ, లాహోర్ వంటి దూరప్రాంతాల నుంచి హాజరైన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చాలామంది అతిథులపై పాక్ అధికారులు చేయి చేసుకున్నారనీ, మొబైల్ఫోన్లు లాక్కున్నారని భారత హైకమిషన్ తెలిపింది. ఇది దౌత్య చట్టాలను ఉల్లంఘించడమేననీ, ఈ వ్యవహారంపై పాక్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అతిథులు రాకుండా భారత్ ఇలాగే అడ్డుకుందనీ, అందుకే ఇలా ప్రతీకారానికి దిగిందని పాక్ దౌత్యవర్గాలు చెప్పాయి. -
శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్కు బెదిరింపు కాల్
సాక్షి, ముంబై: ఠాణేలోని ఓవల్-మాజీవాడ నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్కు రవి పుజారి ముఠా నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో స్థానిక పోలీసు కమిషనర్ వి.వి.లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మాజీ వైద్య, విద్యా శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ బెదిరింపు ఫోన్ వచ్చిన విషయం మరువకముందే సర్నాయిక్కు ఫోన్ రావడం పోలీసు శాఖను కలవరానికి గురిచేసింది. గత పది రోజులుగా తన కార్యాలయానికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫొన్ నంబరు వివరాలను పోలీసులకు అందజేశారు. నంబరు ఆధారంగా స్థానిక వర్తక్నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సర్నాయిక్ రాజకీయాలతో పాటు హోటల్, బిల్డర్ రంగంలో ఉన్నారు. పాన్సరే మాదిరిగా హతమారుస్తామని ఇదివరకే అవ్హాడ్కు బెదిరింపు ఫోన్ వచ్చింది. తాజాగా సర్నాయిక్కు కూడా బెదిరింపు ఫోన్ రావడంతో ఇరువురికి పోలీసు రక్షణ కల్పించారు.