breaking news
budget session of the assembly
-
నిర్మలమ్మ స్ఫూర్తితో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ 2021 ను కాగితం లేకుండా ప్రవేశపెట్టింది. చరిత్రలో మొదటిసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూట్కేసుతో కాకుండా ట్యాబ్ పట్టుకొచ్చి పార్లమెంట్లో చదివి వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాదిరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిజిటల్ బడ్జెట్ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ట్యాబ్స్ కొనాలని సూచించింది. ‘కాగితం లేకుండా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం.. అందరూ ట్యాబ్లు కొనండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆ ట్యాబ్ల కోసం రూ.50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారంతా ట్యాబ్స్ కొనుగోలు చేస్తే రూ.50 వేలు చెల్లిస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది. అది కూడా యాపిల్ ట్యాబ్స్ కొనాలని సూచించింది. దీనికోసం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేయనుంది. ఈనెల 18వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపు ట్యాబ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలో మార్చేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రులు కూడా ఈ కేబినేట్ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కాగితం రహిత బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తెలిపారు. -
ఫిరాయింపుల ప్రస్తావన ఏది?: ఉత్తమ్
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో రాజకీయ ఫిరాయింపుల ప్రస్తావన ఏదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అధికార టీఆర్ఎస్ నిస్సిగ్గుగా చేర్చుకుందని గురువారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శిం చారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని గవర్నర్ ప్రసంగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాల పట్ల ప్రభుత్వానికి కొంత కూడా గౌరవం లేదని విమర్శించారు. అనైతికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోకుండా ప్రశంసించే విధంగా గవర్నర్ ప్రసంగం ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. -
బడ్జెట్ సమావేశాలు షురూ
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అనంతరం సభ వాయిదా నేడు దివంగత ఎమ్మెల్యే వెంకట్రెడ్డి మృతికి సంతాపం ఆపై సమావేశం కానున్న బీఏసీ.. ఆదివారం సభ నిర్వహణపై నిర్ణయం హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్రావు గవర్నర్కు స్వాగతం పలికారు. నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాల ముందే ప్రసంగం మొదలు పెట్టిన గవర్నర్...25 నిమిషాల్లో ప్రసంగం ముగించారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుందని భావించినా జరగలేదు. ‘‘బీఏసీ సమావేశాన్ని శుక్రవారం జరుపుతాం. సభ మొదలు కాగానే దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్రెడ్డి హఠాన్మరణానికి సంతాప తీర్మానం ఉంటుంది. అనంతరం బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తాం. మొత్తం పనిదినాల్లో ఒకరోజు సంతాప దినం పోవడం వల్ల ఒక పనిరోజు తగ్గుతోంది. దీన్ని కవర్ చేయడానికి ఆదివారం కూడా సభ జరపాలా, వద్దా అని ఆలోచిస్తున్నాం. ఈ విషయంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటాం. శనివారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలవుతుంది’’ అని మంత్రి హరీశ్రావు అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పారు. అమరవీరులకు నివాళి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయం 10 గంటలకు గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. టీటీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు వేసుకుని తొలుత టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఎర్రబెల్లి దయాకర్రావు, రాజేందర్రెడ్డి, ప్రకాశ్గౌడ్, సాయన్నలు కలసి అసెంబ్లీకి చేరుకోగా మరో ఎమ్మెల్యే వివేకానంద కొంత ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు. తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని బుధవారం స్పీకర్కు లేఖ రాసిన మరో ఇద్దరు టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలు తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేదు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాక సమావేశాలకు హాజరుకావాలని వారు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రశాంతంగా సభ గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడటం, ప్రసంగ ప్రతులను చించి ఆయనపై విసరడం వంటి ఘటనల నేపథ్యంలో ఈసారి అటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని, నిరసన తెలిపే ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం హెచ్చరికలా పనిచేసింది. సభలో నిరసనలేవీ జరగకుండా గవర్నర్ ప్రసంగం ప్రశాంతంగా ముగిసింది. దీనిపై మంత్రి హరీశ్ స్పందిస్తూ ‘‘ఉద్యమ సమయంలో అసెంబ్లీలో నిరసనలకు దిగడం నాడు అవసరమైన పోరాట రూపం. ప్రస్తుతం తెలంగాణ కల సాకారమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి. సభ హుందాగా సాగాలి. గవర్నర్ను గౌరవించాలి. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నాం. కానీ ఎవరినీ హెచ్చరించలేదు’’ అని పేర్కొన్నారు.