breaking news
big stones
-
గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్
కొలంబో: ఈ నెల ఒకటో తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో సైనిక ఆసుపత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని డాక్టర్లు విజయవంతంగా బయటకుతీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా బయటపడ్డ కిడ్నీ స్టోన్స్లో ఇదే పెద్ద రాయిగా రికార్డుకెక్కింది. ఈ రాయి బరువు 801 గ్రాములు, పొడవు 13.37 సెంటీమీటరు. ఇది రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడం గమనార్హం. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న కిడ్నీ స్టోన్ను, 2008లో పాకిస్తాన్లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. శ్రీలంకలో వెలికితీసిన రాయి ఆ రెండింటినీ అధిగమించింది. -
మట్టిపెళ్లలు విరిగిపడి కూలీ మృతి
హైదరాబాద్: పైప్లైన్ నిర్మాణం చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి శివమణి(20) అనే కూలీ గురువారం మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు... మహబూబ్ నగర్ జిల్లా ధనవాడకు చెందిన శివమణి, ఔటర్ రింగురోడ్డు పనుల్లో బాగంగా తారామతి పేట వద్ద పైప్లైన్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మట్టిపెళ్లలు విరిగిపడి కూలీ మృతి