breaking news
best adviser
-
18 ఏళ్లప్పుడు దీపికా పదుకొణెకు వచ్చిన చెత్త సలహా అదేనట..
Deepika Padukone Reveals She Get Worst Advice At Her 18: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన నటన, అందంతో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్తో బీటౌన్లో పాపులర్ హీరోయిన్గా స్టార్డమ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన చెత్త, ఉత్తమ సలహాలను గుర్తుచేసుకుంది. చెత్త సలహా గురించి చెబుతూ 'నా 18 ఏళ్ల వయసులో నన్ను ఒకరు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకోండి అన్నారు. అయితే నేను దాన్ని సీరియస్గా తీసుకోనంత పరిణితిగా ఆలోచించా. అప్పుడే సున్నితమైన అంశాలపై పరిణితితో ఎలా ఆలోచించా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.' అని చెప్పుకొచ్చింది. ఇక తనకు వచ్చిన ఉత్తమ సలహా గురించి 'బాలీవుడ్లో నా మొదటి సినిమా షారుఖ్ ఖాన్కు జంటగా నటించిన ఓం శాంతి ఓం. షూటింగ్ టైంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన మంచి సలహాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడైనా సరే నీకు మంచి సమయాన్ని ఇచ్చే వ్యక్తులతోనే పనిచేయు. ఎందుకంటే ఒక పని కానీ, ఒక సినిమా కానీ చేస్తున్నావంటే అందులోనే నీ జీవితాన్ని గడుపుతావు. అవే జ్ఞాపకాలవుతాయి. అనుభవాలను ఇస్తాయి. అందుకే పనిచేసేటప్పుడూ చుట్టు ఉండే వ్యక్తులు కూడా ముఖ్యమే' అని దీపికా తెలిపింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
అకౌంటింగ్ వ్యవస్ధ మెరుగుకు సలహాలివ్వండి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో మనోహర్ పారికర్ సాక్షి, న్యూఢిల్లీ: ఏ వ్యాపారానికైనా ఛార్టడ్ అకౌంటెంట్లు ఉత్తమ సలహాదారులని, ఏ సంస్ధకైనా పటిస్ఠ ఆర్ధిక వ్యవస్తకు వారు వెన్నెముక్క లాంటివారని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసిఎఐ) 67 సంవత్సరాల వృత్తి ప్రావీణ్యతను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి మనోహర్ పారికర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 1500 మంది నిపుణులు హాజరయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంటింగ్ వ్యవస్ధ పనితీరును మరింత మెరుగు పర్చడానికి ఐసిఎఐ తగు సలహాలివ్వాలని రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐసిఎఐ అధ్యక్షుడు ఎం. దేవరాజా రెడ్డి మాట్లాడుతూ గత 67 సంవత్సరాలుగా ఐసిఎఐ ప్రామాణికతలను పెంచి పోషిస్తూ, తటస్ధ నియంత్రకంగా, అకౌంటెన్సీ వృత్తికి మార్గదర్శకంగా పని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ మొదటి చొరవ అయిన ఆదాయపు డిక్లరేషన్ పధకం, 2016 విజయం సాధించడానికి అనువుగా ఐసిఎఐ పాల్గొంటుందని దేవరాజా రెడ్డి చెప్పారు. శనివారం నుంచి ఈ పధకం పై దేశ వ్యాప్తంగా ఉన్న ఐసిఎఐ 154 శాఖలలో అవగాహనా కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు.