breaking news
avinash devchandra
-
అవినాష్కు 15 రోజుల రిమాండ్
సామర్లకోట : మానవ హక్కుల సంఘం మాటున మోసాలకు, దురాగతాలకు పాల్పడి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్రను పోలీసుల హైడ్రామా మధ్య శుక్రవారం రాత్రి పెద్దాపురం సబ్ జెయిల్కు తరలించారు. పెద్దాపురం పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఎస్పీ వచ్చే సమయానికే అవినాష్ను పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు. అప్పటికే కోర్టు సమయం దాటిపోవడంతో జడ్జి ఎస్.శ్రీనివాస్ ఇంటి వద్ద హాజరు పర్చారు. సుమారు గంట విచారణ చేసిన తరువాత జడ్జి ఈనెల 27 వరకు రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు భారీ భద్రత మధ్య పెద్దాపురం సబ్ జెయిల్కు తరలించారు. కాగా పెద్దాపురం పోలీసులు అవినాష్పై పెట్టిన కేసులు (క్రైమ్ నెం.63/2015 యు/ఎస్.419,420,506,170 ఆర్/డబ్లు 34 ఐపీసీ) కూడా బెయిల బుల్ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నారుు. ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడం వల్ల అవినాష్ వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. అవినాష్ ఉపయోగించిన కారును, సెల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకాధికారి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో అవినాష్ను చూడటానికి అనేక మంది వచ్చారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కో ఆర్డినేటర్ అరెస్టు అమలాపురం టౌన్ : కాగా మానవ హక్కుల వేదిక పేరుతో జిల్లాలో అక్రమ వసూళ్లు, దందాలకు దిగిన అవినాష్ మోసాలు తవ్వేకొద్దీ బయటపడుతున్న క్రమంలోనే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు వ్యక్తులు చేసిన అక్రమాలు వెలుగు చూశాయి. పెద్దాపురం మండలం కొండపల్లి వేదికగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కో ఆర్డినేటర్గా చెప్పుకుంటున్న అదే గ్రామానికి చెందిన కోండ్రు సతీష్ను అమలాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చే శారు. అమలాపురం పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ అరెస్టు చేసిన సతీష్ను విలేకరులకు చూపి, వారి మోసాలను వివరించారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటూ నకిలీ ఐడెంటిటీ కార్డులు, కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో, పట్టణాల్లో యువకులను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా జి.డి.గోపి, ఆర్గనైజర్గా ఉబయతుల్లాఖాన్, రాష్ట్ర కో ఆర్డినేటర్గా తిరుమలరెడ్డి వ్యవహరిస్తూ జిల్లా శాఖకు సతీష్ను కో ఆర్డినేటర్గా నియమించారు. సతీష్ జిల్లాలో పలు చోట్ల యువకుల వద్దకు వెళ్లి తమ ఆర్గనైజేషన్లో చేరితే పదవులతోపాటు ఐడెంటిటీ కార్డులు ఇస్తామని, వాటితో ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్ల వంటి సంస్థలకు వెళ్లి ప్రశ్నించే హక్కు ఉంటుందని, పోలీసులు కూడా భయపడతారని నమ్మించాడు. సభ్యత్వానికి రూ.5వేల చొప్పున వసూలు చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బెదిరిస్తే ఇచ్చే సొముమ్ల్లో కొంత తమకు ఇవ్వాలన్న షరతు పెట్టాడు. అమలాపురానికి చెందిన తొమ్మిదిమందికి నకిలీ ఐడెంటిటీ కార్డులు జారీ చేశాడు. అవినాష్ ఉదంతం బయటపడగానే అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఈ ఆర్గనైజేషన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని పోలీసులు సీజ్ చేసి అందులోని ఫోటోల ఆధారంగా కొందరి అదుపులోకి తీసుకుని విచారించగా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ బోగస్ మానవహక్కుల వేదిక మోసాలు వెలుగు చూశారుు. ఈనెల 9న పెద్దాపురంలో తమ సంస్థ అంతర్జాతీయ సభ నిర్వహిస్తున్నట్టు ఖరీదైన ఆహ్వాన పత్రాలు ముద్రించి, వాటిపై హోంమంత్రి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను ముద్రించి వారు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై అమలాపురం పోలీసులు ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధులెవరూ తమకు ఆహ్వానాలు లేవని చెప్పారు. కాగా సతీష్తోపాటు ఆ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులైన గోపి, ఖాన్, తిరుమల రెడ్డితోపాటు మరో 10మందిపై కేసులు నమోదు చేశామని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. వీరిపై 415, 419, 420, 471, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. సతీష్ను కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. -
టక్కరి దొరికాడు
అమలాపురం (తూర్పుగోదావరి) : మానవ హక్కుల చైర్మన్ పదవిని... హోంమంత్రితో చుట్టరికం పేరు అడ్డుపెట్టుకుని జిల్లాలో దందాలకు దిగిన మాయల మరాఠి పేరాబత్తుల అవినాష్ దేవ్ చంద్ర చేసిన తప్పులకు తప్పుకోలేని పరిస్థితుల్లో... తనను కాపాడే దారులన్నీ మూసుకుపోవటంతో ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్లో డీజీపీ కార్యాలయంలో స్వచ్చందంగా సరెండరయ్యాడు. అవినాష్ అక్రమాలు, అడ్డాలు నాలుగు రోజుల కిందట ప్రసార మాద్యమాలు తూర్పారబెట్టడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆ మాయలోడు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో జల్లెడపట్టాయి. అతను హైదరాబాద్లోనే కొన్ని అదృశ్య శక్తుల నీడలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో ఆ నగరానికి జిల్లా నుంచి పోలీలు బృందాలు మూడు రోజుల కిందటే వెళ్లి గాలిస్తున్నాయి. ఇంతలో అవినాషే డీజీపీ కార్యాలయంలో లొంగిపోయి అతని ఆచూకీ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించాడు. అయితే తొలి నుంచీ అవినాష్కు అండగా నిలుస్తున్న టీడీపీ ప్రభుత్వంలోని ఓ అదృశ్య శక్తి ఏదో అతని సరెండర్ ప్యూహంలోనూ తెరవెనుక పనిచేసినట్లు తెలుస్తోంది. అవినాష్ తాను చేసిన మోసాలు, అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండటం... హోంమంత్రి బంధువంటూ చెలరేగిపోవటంతో ఇప్పుడు అతడ్ని బహిరంగంగా... ప్రత్యక్షంగా కాపాడే అవకాశాలు ఆ అదృశ్య శక్తికి సన్నగిల్లాయి. దీంతో ఎంతటి అజ్ఞాతంలో ఉన్నా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పన్నిన నిఘా వలకు ఒకట్రెండు రోజుల్లో అవినాష్ చిక్కక తప్పేదికాదు. ఈ క్రమంలో అతడికి అండగా అదృశ్య శక్తులే సరండర్కు స్కెచ్ గీశారని తెలుస్తోంది. అతను అజ్ఞాతంలో ఉండేగొలదీ ప్రభుత్వానికి అప్రదిష్ట పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సరెండరై ఈ కరెప్షన్ కధను కంచికి పంపాలని... ఈ ప్రచారాలకు తెరదించాలనే స్వచ్ఛంద లొంగుబాటును అనివార్యం చేశారు. అవినాష్ అక్రమాలు వెలుగు చూసిన 72 గంటల్లో ఆ టక్కరిని అదుపులోకి తీసుకోవటంతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఊపిరిపోల్చుకుంటోంది. ఊపిరి పీల్చుకున్న బాధితులు అవినాష్ దౌర్జన్య దృశ్యాలు టీవీలో చూసి అతనికి భయపడి ఫిర్యాదు చేసేందుకు జంకిన జిల్లాలోని బాధితులు అతను పోలీసులకు సరెండర్ కావడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. మొన్నటి వరకు అవినాష్ వల్ల ఎన్ని ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైనా ఆ బాధను అతని ఆగడాలకు దడిసి గుండెల్లో దాచుకున్నారు. ఫిర్యాదు చేస్తే రాజకీయ అండతో తమనేంచేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పోలీసుల అదుపులోకి రావడంతో బాధితుల్లో కొంత ధైర్యం కనిపిస్తోంది. అతని బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఇక ముందుకు రావచ్చునని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి హైదరాబాద్లోని ఏపీ డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్ను విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీసు బందోబస్తుతో గురువారం మధ్యాహ్నమే అక్కడ నుంచి పెద్దాపురానికి తరలించే ఏర్పాట్లు చేశారు. పెద్దాపురం సీఐ శివకుమార్కు డీజీపీ కార్యాలయ అధికారులు ఆ నిందితుడిని అప్పగించారు. రాజమండ్రి నుంచి ఒకటి, పెద్దాపురం నుంచి రెండు కేసులు అవినాష్పై నమోదు కావడం... మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉండడంతో విచారణ నిమిత్తం అవినాష్ను హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి తీసుకువస్తున్నారు. అవినాష్కు అంగుళూరులో ఆధార్ అవినాష్కు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం చిరునామాతో ఆధార్ కార్డు, రేషన్కార్డు ఉంది. కొన్నేళ్ల క్రితం కోనసీమ నుంచి ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడానికి వలస వెళ్లిన అవినాష్ కుటుంబానికి అంగుళూరు గ్రామంలో బంధువులు ఉన్నారు. అతని అమ్మమ్మది ఆ గ్రామమేనని తెలిసింది. అయితే ఆధార్ కార్డులో అతని వయసు 1990 జనవరి 4న పుట్టినట్టుగా ఉంది. ఆలెక్కన అతని వయసు ప్రస్తుతం 25ఏళ్లు ఉండాలి. అయితే అతని వయసు 32ఏళ్లు కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజీ పొందేందుకు అవినాష్ ఇక్కడ ఆధార్ పుట్టించుకున్నాడా అనే అనుమానాలు ఆ గ్రామంలో గురువారం ప్రజల నుంచి వ్యక్తమవడం గమనార్హం.