breaking news
anti-terror
-
ఉగ్రవాదంపై ఉక్కుపాదాలై...
నేడు యాంటీ–టెర్రరిజం డేఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదానికి... ఆమె ధైర్యం... ఉక్కుపాదం. ఆమె సాహసం... రక్తం రుచి మరిగిన నరరూప రాక్షలసుల పాలిట వజ్రాయుధం. ఉగ్రవాదం పీచమణచడంలో వివిధ స్థాయులలో, విభాగాలలో ఎంతోమంది మహిళా సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నారు...‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యంలోని ఉమెన్ ఆఫీసర్లు మేల్ ఆఫీసర్లతో సరిసాటిగా కాల్పులు, మిస్సైల్ ప్రయోగాలలో తమ సత్తా చాటారు. శత్రువులకు దడ పుట్టించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న సిగ్నల్స్ రెజిమెంట్కి చెందిన ఒక మహిళా అధికారి (పేరు వెల్లడి చేయలేదు) తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె, ఆమె టీమ్ గ్రౌండ్లోనే కాకుండా ఎయిర్లో కూడా కమ్యూనికేషన్స్ని హ్యాండిల్ చేశారు.‘ఏ యుద్ధంలో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. నేను ఈ ఆపరేషన్లో భాగం కావడం గర్వంగా ఉంది. మా టాస్క్లన్నీ అంకితభావంతో పూర్తి చేశాం. గ్రౌండ్ మీద లేదా ఎయిర్లో కాన్ఫ్లిక్ట్ని వీడియో గ్రాఫ్ చేయడంలో కమ్యూనికేషన్కి సంబంధించిన అన్ని అంశాలనీ చూసుకున్నాం’ అన్నారు. ‘విధి నిర్వహణలో పురుష అధికారులకు, మహిళ ఆఫీసర్లకూ తేడా ఉంటుందా?’ అనే ప్రశ్నకు... ‘ఫ్రంట్లైన్లో స్త్రీలు, పురుషులకు ఒకేరకమైన విధి నిర్వహణ ఉంటుంది. అందరినీ ఒకేరకంగా చూస్తారు. మహిళలుగా మేము ప్రత్యేక సౌకర్యాలని కోరుకోలేదు. ఎందుకంటే మేము దేశం కోసం యుద్ధం చేస్తున్నాం’ అంటారు ఉమన్ ఆఫీసర్.ఆమె భర్త ఆర్మీలో సిగ్నల్స్ ఆఫీసర్గా పనిచేసేవారు ‘ఆపరేషన్ రైనో’ సమయంలో ఆయన అరుణాచల్ప్రదేశ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. ఉల్ఫా ఉగ్రవాదుల ఏరివేతకు అస్సాం–అరుణాచల్ద్రేశ్ సరిహద్దులలోని దట్టమైన అడవుల్లో ‘ఆపరేషన్ రైనో’ మెరుపుదాడిలా మొదలైంది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉగ్రవాదులతో పోరాడడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏ మూల నుంచి అయినా మృత్యువు పొంచి ఉండవచ్చు. ‘ఆపరేషన్ రైనో’కి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఆ ఉమన్ ఆఫీసర్ మది నిండా ఉన్నాయి. అయితే ఏ జ్ఞాపకమూ ఆమెను వెనక్కి లాగలేదు. ‘సాధారణ జీవితమే మేలు’ అనుకునేలా చేయలేదు.భర్తకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం... యుద్ధరంగంలో ముందడుగు వేయడానికి అవసరమై శక్తిని ఇచ్చాయి. ‘భారత సైన్యంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబుగా ‘నా భర్త ఇండియన్ ఆర్మీలో సిగ్నల్స్ కార్ప్లో పనిచేసేవారు. నా భర్త చేసిన త్యాగమే నన్ను ఆర్మీలో చేరేలా చేసింది’ అని చెప్పారు. ఆర్మీలో చేరాలనే ఆకాంక్ష ఆమెతోనే ఆగిపోలేదు. ఆమె కొడుకు కూడా ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు కనిపించరు. దేశం కనిపిస్తుంది... అలాంటి అరుదైన ఒక కుటుంబ ఈ ఉమెన్ ఆఫీసర్ది.ఆల్–ఉమెన్ కమాండో టీమ్కొత్త సెక్యూరిటీ బ్లూప్రింట్లో భాగంగా ఉత్తర్ప్రదేశ్లో యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)లో తొలిసారిగా ఆల్–ఉమెన్ కమాండో టీమ్ ప్రారంభించారు. 36 మంది ఉమెన్ కమాండోలతో ఈ టీమ్ మొదలైంది. విధానసభ, రాజ్ భవన్, క్రికెట్ స్టేడియం, ముఖ్యమంత్రి నివాసంలాంటి ప్రాంతాల రక్షణకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అన్ని రకాల ఆయుధాలను హ్యాండిల్ చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇజ్రాయెల్ అన్ఆర్మ్డ్ కంబాట్ టెక్నిక్లో కూడా తర్ఫీదు ఇచ్చారు. ఆల్–ఉమెన్ కమాండో టీమ్కు ఎంపికైన వారిలో ఉత్తర్ప్రదేశ్లోని చిన్న పట్టణమైన బులంద్షహర్కు చెందిన చంచల్ తెవోటియా యాంటి–టెర్రరిస్ట్ స్క్వాడ్లో అత్యంత పిన్న వయస్కురాలు. తక్కువగా మాట్లాడే ఈ అమ్మాయి మాక్ డ్రిల్లో సత్తా చాటింది. గరుడ–యాంటీ టెర్రర్ ఫోర్స్‘గరుడ’ అనేది కర్ణాటక రాష్ట్ర యాంటీ–టెర్రర్ ఫోర్స్. ఈ స్పెషల్ ఆపరేషనల్ టీమ్లో కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదహారుమంది యువతులు ఉన్నారు. వీరికి ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో, ఆయుధాలు చేపట్టడంలో శిక్షణ ఇచ్చారు. పోలీసర్ ఆఫీసర్ మధుర వీణ ఆధ్వర్యంలో ఈ ఫోర్స్ పనిచేస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ప్రధానంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల మాటల్లో చెప్పాలంటే... ఇది సాధారణమైన ట్రైనింగ్ కాదు. ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత ఒక ఉమెన్ కమాండో ఆయుధాలతో ఉన్న ముగ్గురు నలుగురితో పోరాడే శక్తిని కలిగి ఉంటారు. -
బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయిన ఫాంటమ్
-
‘ఉగ్ర’ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. ఈ సవరణలపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని హోం మంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. ఉగ్రవాదుల కన్నా దర్యాప్తు సంస్థలు నాలుగడుగులు ముందుండాలంటే ఈ సవరణలు కచ్చితంగా అవసరమేనని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)–2019పై లోక్సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్లో పాల్గొనకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోవడంపై అమిత్ షా స్పందిస్తూ ‘మీ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఓటింగ్కు దూరంగా వెళ్లిపోతున్నారు. దీనికి మేం ఏం చేయగలం?’ అన్నారు. సవరణ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ చట్టంతో సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అనడంపై అమిత్ షా స్పందిస్తూ ‘సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1967లో నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వమే తెచ్చింది. అంటే సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్ వల్లే, ఆనాడే దెబ్బతిన్నది’ అంటూ ఎదురుదాడి చేశారు. ఈ చట్టానికి తెచ్చిన సవరణలను, చట్టాన్ని తాము దుర్వినియోగం చేయబోమనీ, కేవలం ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేందుకే దీనిని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే కొంతమంది వ్యక్తులు సిద్ధాంతాల పేరుతో పట్టణ మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, అలాంటి వారిపై ప్రభుత్వం ఎంతమాత్రమూ దయ చూపదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒవైసీ ఒత్తిడితో నాటకీయ పరిణామాలు సవరణ బిల్లును ఆమోదించడానికి ఓటింగ్ జరపాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పట్టుబట్టడంతో సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ అప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలోనూ బిల్లును ఆమోదించడానికి ముందు ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దీంతో ఆయన అనవసరంగా సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒవైసీ దూకుడుగా సమాధానమిస్తూ ‘ఓటింగ్ కోరడం నా హక్కు. అభ్యంతరం తెలపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 287 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 8 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ పట్టుబట్టగా..నిబంధనలను ప్రస్తావిస్తూ సభ్యులను నిల్చోబెట్టి సమర్థిస్తున్న వారెంత మంది, వ్యతిరేకిస్తున్న వారెంత మంది అని స్పీకర్ లెక్కించారు. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం మొత్తాన్నీ నిల్చొనేలా చేశాను’ అని వ్యాఖ్యానించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడేందుకు మేం సిద్ధమే. ఇప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల్చున్నాం’ అని అన్నారు. సవరణ బిల్లులో ఏముంది? ‘ఉగ్రవాద, వినాశక కార్యకలాపాల నిరోధక చట్టం’ (టాడా), ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ (పొటా)లకు మార్పులు చేస్తూ ఈ ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)’ బిల్లులను కేంద్రం తెచ్చింది. ఈ సవరణలు ఏం చెబుతున్నాయంటే.. ► ఉగ్రవాదానికి పాల్పడిన లేదా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న, ఉగ్రవాద హింసాకాండకు ఏర్పాట్లు చేసిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదానికి ఇతరత్రా సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలను ఈ చట్టం కింద ఉగ్రవాదులుగా లేదా ఉగ్రవాద సంస్థలుగా కేంద్రం ప్రకటించవచ్చు. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే అధికారి.. నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటే ముందుగా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అనుమతి తీసుకోవలసి ఉంది. తాజా సవరణల ప్రకారం.. కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి దర్యాప్తు చేస్తున్న పక్షంలో ఆస్తుల జప్తుకోసం డీజీపీ అనుమతి కాకుండా, ఎన్ఐఏ డీజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేసులను పోలీసులే దర్యాప్తు చేస్తుంటే డీజీపీ అనుమతి అవసరం. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ), పై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. తాజా సవరణల ప్రకారం ఎన్ఐఏలోని ఇన్స్పెక్టర్ లేదా ఆ పై స్థాయి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. ► ప్రస్తుత చట్టానికి అనుబంధంగా తొమ్మిది అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత సవరణ కింద ఆ ఒప్పందాలతో పాటుమరో ఒప్పందాన్ని(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం–2005) కూడా చేర్చారు. ఇక నుంచి ఈ పది ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొంటారు. నేడు లోక్సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో గురువారం ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా కేంద్రం చేర్చింది. ఆ సమయంలో కచ్చితంగా సభలో ఉండాలంటూ తమ ఎంపీలకు అధికార బీజేపీ ఇప్పటికే విప్ కూడా జారీ చేసింది. ఉన్నట్టుండి, ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులను జైలుకు పంపేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో తనకున్న భారీ సంఖ్యబలంతో లోక్సభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. పార్లమెంటు సమాచారం ► ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని న్యాయశాఖ మంత్రి రవి శంకర్ప్రసాద్ లోక్సభలో తెలిపారు. న్యాయ శాఖ పరిధిలోని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయని స్పష్టం చేశారు. ► పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పేర్లు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్కు దగ్గరగా ఉన్నందున, పేరు మార్చడాన్ని కేంద్రం తిరస్కరిస్తోందన్నారు. ► కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వెళ్లడం 40 శాతం తగ్గిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. సరిహద్దు చొరబాట్లు 43 శాతం, ఉగ్ర చర్యలు 28 శాతం తగ్గాయన్నారు. యూపీఏ –2లో పోలిస్తే మావోయిస్టుల దాడులు 43 శాతం తగ్గాయని వెల్లడించారు. ► మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, సంఘపరివార్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ల మృతిపై ప్రత్యేక విచారణ జరిపే ఆలోచనేదీ లేదని మంత్రి కిషన్రెడ్డి రాజ్యసభలో తెలిపారు. ► భారత్తో సరిహద్దు పంచుకుంటున్న చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో కంచె నిర్మించే ప్రతిపాదనేమీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యలు పక్కాగా తీసుకుంటుండడంతో సరిహద్దు చొరబాట్లు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇండో–పాక్ సరిహద్దులో 2069 కిలోమీటర్లకుగాను 2004 కిలోమీటర్ల కంచె పూర్తయిందన్నారు. ఇండో–బంగ్లా సరిహద్దులో 3326 కిలోమీటర్లకుగాను 2803 కిలోమీటర్ల కంచె పూర్తయిందని వెల్లడించారు. ► మూడేళ్లలో ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా 239 శాటిలైట్లను ప్రయోగించి, రూ. 6,289 కోట్లు ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో తెలిపారు. ► భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రష్యా వెల్లడించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లోక్సభలో తెలిపారు. 2014 నుంచి ఈ విషయమై రష్యాను అడుగుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ► విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2015 ఫిబ్రవరి నుంచి 2019 జూలై 18 వరకు 50,605 సమస్యలను నమోదు చేసుకోగా 44,360 సమస్యలను (దాదాపు 90 శాతం) తీర్చామన్నారు. అందులో 36,805 సమస్యలు గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయన్నారు. ఎమ్ఏడీఏడీ పోర్టల్ ద్వారా సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. -
పాక్ యాంటీటెర్రర్ గ్రూప్లో మహిళలు
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావియెన్స్ ప్రభుత్వం.. ఉగ్రవాద వ్యతిరేక దళంలో తొలిసారిగా మహిళలకు చోటు కల్పించింది. 40 మంది యువతులు ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రర్ డిపార్ట్మెంట్లో విధుల్లో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అనేకరకాల దేహదారుఢ్య పరీక్షలతోపాటు మెడికల్ టెస్ట్లు, ఇంటర్వూ్యలు నిర్వహించిన తర్వాత వారిని ఎంపిక చేశామని, పాక్ ఆర్మీతో ఎంపికైన యువతులకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఆరునెలల ఎంపికైన నలభై మందిని ఆరునెలల శిక్షణ తర్వాత పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ హోదాతో సమానమైన పోస్టుల్లో నియమిస్తామని, పనితీరు ఆధారంగా రెగ్యులర్ కౌంటర్ టెర్రర్ డిపార్ట్మెంట్, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్లో చోటు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం చట్టాలను సవరించింది. దీంతో పోలీస్ విభాగంలో ఉద్యోగాల కోసంగాను నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైనవారిలో మహిళల సంఖ్య 2శాతం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. పాక్లో మొత్తం పోలీసుల సంఖ్య 3,91,364 కాగా అందులో 5,731 మంది మాత్రమే మహిళలున్నారు.