breaking news
Advertising hip
-
వినరా సర్కారు వీరగాథ..
విశాఖపట్నం: గద్దెనెక్కి ఎనిమిది నెల లైంది.. ఆర్థిక లోటు..జీతాలు కూడా ఇవ్వలేక వందలకోట్ల మేర చెల్లిం పుల నిలిపివేత.. ప్రజలకు మాత్రం భ్రమలు కల్పించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చే స్తోంది. ఇటీవల శ్రీకారం ప్ర చార కళాజాతాలే నిదర్శనం. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అ వగాహన కల్పించడమే ల క్ష్యంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన రాష్ర్ట వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు. రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది. ఈ రథంపై ముగ్గురు నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక సాంస్కృతిక బృందాలు గ్రామకూడళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తారు. ప్రదర్శనకు రూ.13వేల చొప్పున చెల్లిస్తు న్నారు. ఈమొత్తంలోనే వాహనం అద్దె, ఆయిల్తో పాటు కళాబృందాలకు ప్రదర్శనకు రూ.1800 చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఒక వాహనానికి రోజుకు రూ.26వేల చొప్పున మూడు వాహనాలకు కలిపి రూ.78వేల చొప్పున ముట్టజెబుతున్నారు. అంటే 40 రోజుల పాటు సాగే ఈ ప్రచార జాతాకోసం ఒక్క మనజిల్లాలోనే రూ.31.20లక్షల ఖర్చు చేస్తు న్నారు. మన రాష్ర్టంలో ఈ కార్యక్రమం కోసం అక్షరాల రూ.4కోట్ల ఐదు లక్షల 60వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాహనాల కాంట్రాక్టు నుంచి సాంస్కృతిక బృందాల ఎంపిక వరకూ రాష్ర్ట స్థాయిలోనే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల కన్నుసన్నల్లోనే జరిగాయని సమాచారం. టెండర్ ప్రక్రియ లేకుండానే అంతానామినేషన్ పద్ధతిలోనే అప్పగించారని చెబుతున్నారు. ఇందుకోసం భారీగానే చేతులు మారినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరొక పక్క గత ఎనిమిది నెలలు సర్కార్ సాధించేంది ఏమీలేదని ప్రజలే పెదవి విరుస్తున్నారు. పింఛన్ల పెంపు మినహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనిఅమలుచేసిన పాపాన పోలేదు. అలాంట ప్పుడు ఏం సాధించారని ఈ ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖకు జిల్లా స్థాయిలో కనీసం ప్రోటోకాల్ కాదు కదా.. కనీసం అధికారులు తిరిగే వాహనాలకు ఆయిల్ ఖర్చులకు కూడా నిధులు మంజూరు చేయని దుస్థితి నెలకొంది. .ఇప్పటికైనా లేనిపోని ప్రచార ఆర్భాటాలకు స్వస్తి చెప్పి నిధుల లభ్యతకనుగుణంగా కేటాయింపులు..ఖర్చులు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
ప్రచార ఆర్భాటమే.. కానుక కొందరికే..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాఫీ మోసాన్ని మరిపించటానికి ముఖ్యమంత్రి కొత్త పథకం వేశారు. అదే చంద్రన్న సంక్రాంతి కానుక. అందుకు రూ.315 కోట్లు ఖర్చుచేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆ నిధులు తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి కానుకకోసం కేటాయించిన నిధులనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు జిల్లాలో చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల పంపిణీ తీరే నిదర్శనం. జిల్లాలో 8.24 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. అయితే చంద్రన్న సంక్రాంతి కానుకలు జిల్లాకు వచ్చింది కేవలం 2.50 లక్షల ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం. వాటికి 2 లక్షల సంచులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వచ్చిన అరకొర సరుకులనే ‘సముద్రంలో ఇంగువ’ కలిపినట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చిన సరుకులను సైతం కొన్నిచోట్ల డీలర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. బోగోలు మండలంలో చంద్రన్న సంక్రాంతి కానుకలను బ్లాక్మార్కెట్ తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో సంచికి రూ.20 వసూలు చేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో మూడు సరుకులే పంపిణీ చేస్తున్నారు. అందులో గోధుమ పిండి, నెయ్యి, కందిపప్పు ఇవ్వటం లేదు. మరి కొన్నిచోట్ల బెల్లం, శనగలు, గోధుమపిండిని సంచుల్లో రేషన్షాపులకు చేర్చారు. దీంతో ఆయా డీలర్లు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్చేసి అలాగే ఇచ్చి పంపేస్తున్నారు. సంచులు ఇవ్వమని అడిగితే.. ‘సంచులు లేవు.. గించులు లేవు’ అని తిట్టి పంపేస్తున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూకాల్లో మోసం... మర్రిపాడు మండలంలోని రామానాయుడుపల్లిలో రేషన్షాపులో చంద్రన్న కానుకలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు లబ్దిదారులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తూకాల్లో మోసం చేస్తుండడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీలర్లు తమ చేతివాటం చూపి ప్రతి సరకు 300 గ్రాములు నొక్కేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఉదయగిరి-నెల్లూరు రహదారిపై గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మర్రిపాడు తహశీల్దారు ఎంవీ కృష్ణారావు గ్రామంలో పర్యటించి విచారణ జరిపి తూకాల్లో మోసాలు వాస్తవమని నిర్ధారించుకున్నారు. అనంతరం రేషన్షాపును సీజ్ చేశారు. ఇలా జిల్లాలో అనేక ప్రాంతాల్లో 100, 150, 200, 300 గ్రాములు నొక్కేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సా... గుతున్న పంపిణీ.. పండగకు ఒకరోజు ముందే సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా.. చంద్రన్న సంక్రాంతి కానుక ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల బుధవారం రాత్రి వరకు పంపిణీ జరిగింది. మరి కొన్ని చోట్ల సరుకులు పంపిణీ చేయలేదు. సరుకులు చాలకపోవటంతో పంపిణీ నిలిపివేశారు. సరుకులు వచ్చాక పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పి కార్డుదారులను తిప్పి పంపేశారు. జిల్లాలో అనేకచోట్ల సంక్రాంతి పండగకు చంద్రన్న కానుక అందే పరిస్థితి కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఇలా ఉంటే... అధికారులు మాత్రం సరకులన్నీ వచ్చాయి.. పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం.