-
విశాఖ మెట్రో డీపీఆర్ త్వరగా పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ (సవివర నివేదిక)ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయంలో బుధవారం ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, స్పెషల్ సెక్రటరీ రామమనోహరరావు, మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డీపీఆర్లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ మెట్రో రైల్ ఉండేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. కోవిడ్ కారణంగా డీపీఆర్ రూపకల్పనలో ఆలస్యమైందని, త్వరలోనే దీనికి తుదిరూపు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు ఏ మార్గాల్లో మెట్రో రైలు ఏర్పాటుకు అవకాశాలున్నాయనే దానిపై చర్చించారు. 75 కిలోమీటర్ల మేర నిరి్మంచే కారిడార్లలో ప్రజలకు సౌకర్యవంతంగా స్టేషన్లు, నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. -
ఎన్నికలకు ముందు..విశాఖ మెట్రోకు ‘పీపీపీ’
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరో జిమ్మిక్కుకు రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. నాలుగున్నర ఏళ్లు ఏమీ పట్టించుకోని రాష్టప్రభుత్వం.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణలో ఎంపికైన సంస్థల నుంచి ఇప్పుడు టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ)కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.కరికాలవలవన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ. 8,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ వ్యయాన్ని రెండు విభాగాలుగా విభజించారు. సివిల్ నిర్మాణాల వ్యయం 51 శాతం వాటాగా రూ. 4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఎలక్ట్రో మెకానికల్ పనుల వ్యయం 49 శాతం వాటాగా రూ. 4,100 కోట్లను డెవలపర్ భరించాల్సి ఉంది. వినూత్న పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేస్తుంది. ఈ అప్పును తీర్చేందుకు మెట్రో ప్రాజెక్టుకు సమీపంలో 250 ఎకరాలను రియల్ ఎస్టేట్కు ఇవ్వనుంది. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం నుంచి అప్పు, వడ్డీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదు సంస్థలు ఆసక్తి.. విశాఖ మెట్రో రైల్ను మూడు కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. మొత్తం 38 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 83 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 12 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించి కేటాయించనున్నారు. డెవలపర్కు పదేళ్ల కాలానికి నిర్వహణకు రూ. 820 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు ఎస్జీఎస్టీ కింద రూ. 527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డెవలపర్కు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ ప్రాజెకుకు సంబంధించి ఇప్పటికే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చిన దరఖాస్తుల్లో ఐదు సంస్థలను ఎంపిక చేసింది. వీటిల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రైల్ (టాటా)ప్రాజెక్టు, షాపూర్జీ పల్లోంజీ, ఎస్సెల్ ఇన్ ఫ్రా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ల ఉన్నాయి. ఈ ఐదు సంస్థల నుంచి బిడ్లు దాఖలు ప్రతిపాదనలను, రాయితీ ఒప్పంద పత్రాలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనుమతించింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 4,200 కోట్ల రుణం మంజూరు చేసేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు వచ్చింది. పీపీపీ విధానం ఇలా.. మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న అప్పును తీర్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 250 ఎకరాలను ఉచితంగా ఏఎంఆర్సీ కేటాయిస్తుంది. ఆ 250 ఎకరాలను ఏడాదికి ఎకరానికి రూ. 100 లీజుపైన రియల్ ఎస్టేట్కు ఇస్తుంది. ప్రతీ ఏడాది లీజును ఐదు శాతం పెంచనున్నారు. ఈ 250 ఎకరాలను 60 సంవత్సరాల పాటు లీజుకు నిర్మాణ సంస్థకు ఇవ్వనున్నారు. ఈ భూమిలో రియల్ ఎసేŠట్ట్, రెసిడెన్షియల్, ఇండస్ట్రీస్, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తారు. 250 ఎకరాల్లో వచ్చే ఆదాయంలో 75 శాతం నిర్మాణ సంస్థకు పోగా 25 శాతం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్కు వస్తుంది. 250 ఎకరాల్లో నిర్మాణాల వ్యయాన్ని డెవలపర్ భరించాలి. పది సంవత్సరాల్లో 250 ఎకరాల్లో నిర్మాణాలకు రూ. 4,350 కోట్లు అవుతుందని అంచనా వేశారు. డెవలపర్కు చెందిన 75 శాతం వాటాకు వచ్చిన భవనాలను, సూపర్ స్ట్రక్చర్స్ను ఇతరులెవ్వరికైనా ఇచ్చేసేందుకు, టైటిల్ను బదిలీ చేసేందుకు అనుమతిస్తారు. ఏఎంఆర్సీకి రానున్న 25 శాతం రెవెన్యూ వాటా చెల్లించడానికి డెవలపర్ ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను తెరవాలి. మైట్రో రైలు నిర్వహణలో లోటు ఏర్పడితే ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి ఏఎంఆర్సీ చెల్లిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా ఏఎంఆర్సీకి వచ్చే ఆదాయం నుంచి విదేశీ సంస్థ నుంచి తీసుకుంటున్న అప్పు, వడ్డీని చెల్లించనున్నారు. 250 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా 30 సంవత్సరాల్లో డెవలపర్కు రూ. 15,692 కోట్ల ఆదాయం, అలాగే ఏఎంఆర్సీకి రూ. 7,066 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లు మెట్రో ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇపుడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా హడావుడి చేయడం చేయడం ఎన్నికల జిమ్మిక్కేనని విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. -
విశాఖ మెట్రో రైలుకు రూ.9,750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణంలో 39 కిలోమీటర్ల మేర, విజయవాడలో 25 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెట్రో రైలుకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అప్పగించిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ తయారీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కిలోమీటరుకు రూ.250 కోట్ల వంతున విశాఖ మెట్రోకి రూ.9,750 కోట్లు, విజయవాడ మెట్రోకి రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడలో తొలిదశలో 13 కిలోమీటర్లు, మలిదశలో 12 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎస్ వివరించారు. మార్చి నెలాఖరులోగా డీపీఆర్ను సమర్పించాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులను కోరారు. డీపీఆర్ రాగానే నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గిరిధర్ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణాలకు నిధులు ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చినందున వీలైనంత త్వరగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగేలాగ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిల్పారామం, పర్యాటక కేంద్రాల అంశాలు, కార్మిక చట్టాలపై సీఎస్ అధికారులతో సమీక్షించారు. కార్మిక చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని నిర్ణయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement