-
వలస కార్మికులు గమ్యం చేరెదెన్నడో!
ముంబై: పదులు.. వందలు కాదు... వేల కిలోమీటర్లను లెక్క చేయకుండా ప్రయాణం సాగించేందుకు సిద్ధమయ్యారు. బతుకు పోరాటం కోసం అడుగడుగునా ఎదురయ్యే కష్టాలను సైతం పంటి బిగువున భరిస్తామంటున్నారు. అటు భానుడి ప్రతాపాన్ని ఇటు పోలీసుల ఆగ్రహాన్ని భరిస్తూ ముందుకు సాగనున్నామని ఆయాసంతో చెప్తున్నారు వలస కార్మికులు. బీహార్లోని దర్భంగాకు చెందిన 15 మంది వలస కూలీలు ముంబైలో పని చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వారి పొట్ట కొట్టినట్టయింది. అన్నం పట్టే నాధుడు లేక, రోజుల తరబడి ఆకలికి ఆగలేక కష్టమైనా నష్టమైనా స్వస్థలాలకు వెళ్లి కలో గంజో తాగి బతుకుతామంటున్నారు. అందుకోసం నేడు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమయ్యారు. (కన్నీటి పర్యంతమవుతున్న వలస కూలీలు) బతుకు చిధ్రమై 45 రోజులు.. అయితే వారిని గమనించిన కొందరు మీడియా ప్రతినిధులు "మీ కోసం ప్రత్యేక రైళ్లు కేటాయించారు కదా? ఎందుకు దాన్ని వినియోగించుకోవట్లే"దని ప్రశ్నించారు. దీనికి కార్మికులు బదులిస్తూ.. "14వ తేదీ తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి సమాచారమివ్వలేదు. ఇప్పటికే బతుకు చిధ్రమై 45 రోజులవుతోంది. ఇంకా అధికారుల నుంచి పిలుపు కోసం ఎదురు చూడలేక ఇలా బయలు దేరుతున్నాం" అని ఓ వలస కార్మికుడు ఆవేదన వెల్లగక్కాడు. ఇదిలా వుండగా నవీ ముంబైకి చెందిన మరో 20 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలైన బుల్దానాకు కాలిబాటన బయలుదేరారు ఇందులో ఏడు నెలల గర్భవతితో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారు కొద్దిపాటి ఆహారాన్ని కూడబెట్టుకుని నడక సాగిస్తున్నారు. (ఈ టెన్షన్ ఎటువైపో?) -
న్యాయమూర్తులకూ తప్పని లాక్డౌన్ కష్టాలు
కోల్కతా: లాక్డౌన్ కష్టాలు న్యాయమూర్తులకూ తప్పలేదు. ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇద్దరు జడ్జ్లు సుమారు 2వేల కి.మీ. ప్రయాణించారు. ఈ ఘటన దేశంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో చోటు చేసుకుంది. కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న దీపాంకర్ దత్తాకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో ఆయన ఉన్నఫళంగా శనివారం కోల్కతాను వదిలి కుటుంబంతో సహా ముంబైకు పయనమయ్యారు. సుమారు 2 వేల కి.మీ.కు పైగా ప్రయాణం అనంతరం సోమవారం మధ్యాహ్నానికి ఆర్థిక రాజధానిలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న బిశ్వనాథ్ సోమద్ధర్ మేఘాలయ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. (పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా) ఇందుకోసం కోల్కతా మీదుగా షిల్లాంగ్కు పయనమయ్యారు. తొలుత ఆయన కోల్కతా హైకోర్టులో సేవలందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అలహాబాద్కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన సీజేగా బాధ్యతలు స్వీకరించేందుకు శుక్రవారం తన భార్యతో కలిసి కారులో బయలుదేరారు. రెండు రోజుల అలుపెరగని ప్రయాణం అనంతరం నేడు మధ్యాహ్నానికి ఆయన షిల్లాంగ్కు చేరుకోనున్నారు. కాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింగ్ గురువారం వీరిద్దరూ ఆయా హైకోర్టుల్లో సీజేగా బాధ్యతలను స్వీకరించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (జడ్జికి కరోనా రానూ: లాయర్ శాపనార్థం) -
ఆర్మీ అధికారి చనిపోతే ఇంత ఘోరమా?
బెంగళూరు: ఆర్మీ అధికారిగా సేవలందిస్తోన్న తన కుమారుడిని కడచూపు చూడాలని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అందుకోసం ఏకంగా 2,600 కి.మీ ప్రయాణించారు. వివరాలు.. ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పురస్కార గ్రహీత నవజోత్ సింగ్ ఆర్మీ ప్రత్యేక దళాల విభాగంలో పని చేస్తున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన గురువారం బెంగుళూరులో కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న తమ తల్లిదండ్రులు బెంగళూరు రావడానికి ఏర్పాట్లు చేయాలని ఆ అధికారి సోదరుడు నవతేజ్ సింగ్ బాల్ కోరారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందును తాము రావడానికి ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. (కరోనా మిస్టరీలు) అయితే దీనికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో తాము ఎలాంటి సహాయం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో చేసేదేం లేక కల్నల్ కుటుంబ సభ్యులు రోడ్డు మార్గంలో కారులో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను కల్నల్ సోదరుడు నవతేజ్ సింగ్ సోషల్ మీడియాలో వివరిస్తూ వచ్చారు. ఈ విషయం గురించి మాజీ ఆర్మీ అధికారి వీపీ జనరల్ ట్విటర్లో స్పందిస్తూ.. "నా ప్రగాఢ సానుభూతి. క్షేమంగా ప్రయాణించండి. దీనికి భారత ప్రభుత్వ అధికారులు మీకు ఎలాంటి సహాయం చేయకపోవడం విచారకరం. చట్టాలేవీ బండరాళ్లపై రాయరు కదా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని మార్చుకోవాలి" అని ఘాటుగా కామెంట్ చేశారు. మరొకవైపు ఎలాంటి సహాయం చేయకుండా ఆ కుటుంబాన్ని అవమానించారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి(చెట్టంత కొడుకే పోయాడు.. ఆ బూడిదతో ఏం పని?) -
ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ.
-
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement