తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఖమ్మం: తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వాజేడు మండలం మరిమల్ల అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో జరిగిన మరోదాడిలో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. బల్రాన్ గుండాలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై స్థానికులతో కలిసి 40 మంది మావోయిస్టులు దాడి చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవానులు దాడిని తిప్పికొట్టడంతో మావోయిస్టులు పారిపోయారు.