రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం | Subrata Roy can't leave the country, says SC | Sakshi
Sakshi News home page

రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం

Jan 29 2014 1:57 AM | Updated on Sep 2 2018 5:20 PM

రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం - Sakshi

రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం

ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అప్పటివరకూ గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ దేశం విడిచి వెళ్లలేరని పేర్కొంది.  ఈ మేరకు ఇంతక్రితం (జనవరి 9) ఇచ్చిన ఆదేశాలను సడలించాలని కోరుతూ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

 ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో  చెప్పకపోతే ఈ విషయం దర్యాప్తునకు తాము తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు.  కేసు  విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 11కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటికల్లా అన్ని అంశాలనూ  సెబీకి సమర్పించాలని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement