ఇష్టం లేకుండా.. అనుమతి లేకుండా.. భార్యను ముట్టుకున్నా అది అత్యాచారమే అవుతుందన్న విషయం ఆ శాస్త్రవేత్తకు తెలియదేమో.. కేసులో ఇరుక్కున్నారు.
ఇష్టం లేకుండా.. అనుమతి లేకుండా.. భార్యను ముట్టుకున్నా అది అత్యాచారమే అవుతుందన్న విషయం ఆ శాస్త్రవేత్తకు తెలియదేమో.. కేసులో ఇరుక్కున్నారు. తపస్ కుమార్ మజుందార్ అనే వ్యక్తి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆహార పరిశోధన ల్యాబొరేటరీ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన తనపై అత్యాచారం చేశారంటూ తపస్ భార్య (30) పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ విషయాన్ని రాయ్పూర్ ఎస్పీ ఓపీ పాల్ తెలిపారు.
2011లో తమకు పెళ్లయిందని, అయితే అప్పటికే ఆయనకు మరో పెళ్లయిన విషయాన్ని తనవద్ద దాచాడని ఆమె ఆరోపించింది. మొదటి భార్యకు విడాకులచ్చినట్లు చెప్పి, తనను పెళ్లాడాడని, కానీ విడాకులు తీసుకోని విషయం తర్వాత తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇప్పుడు తపస్పై ఐపీసీ సెక్షన్లు ౩76 (అత్యాచారం), 419 (మోసగించడం), 496, (మోసగించి పెళ్లిచేసుకోవడం), 498(ఎ) (భార్యను హింసించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తపస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఉద్యోగం చేస్తున్నాడు.