నాణ్యమైన విద్యకు ఐఐటీలదే బాధ్యత! | Pranab Mukherjee asks IITs to improve quality of education | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యకు ఐఐటీలదే బాధ్యత!

Aug 22 2014 6:03 PM | Updated on Sep 2 2017 12:17 PM

నాణ్యమైన విద్యకు ఐఐటీలదే బాధ్యత!

నాణ్యమైన విద్యకు ఐఐటీలదే బాధ్యత!

దేశంలోని నాణ్యమైన విద్యను అందించేందుకు ఐఐటీల నడుంబిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్సష్టం చేశారు.

న్యూఢిల్లీ:దేశంలోని నాణ్యమైన విద్యను అందించేందుకు ఐఐటీల నడుంబిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్సష్టం చేశారు. దీనికి సంబంధించిన మార్గాలను ఐఐటీలు అన్వేషించాలని ఆయన తెలిపారు. ఆ రకంగా విద్యలో నాణ్యత ఉన్నప్పుడు భారతదేశం మానవ వనరల్లో విశిష్టమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో ఐఐటీ బోర్డు అధ్యక్షులతో సమావేశమైన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో జ్ఞానం పెంపొందించడానికి ఐఐటీ  నాయకత్వం వహించాలి.

 

అందుకోసం తగిన ప్రణాళికలతో ఐఐటీ నిపుణులు ముందుకెళ్లాలి. ఏ రకంగా అయితే నాణ్యమైన విద్యను అందించ గలమో.. దాని కోసం ఐఐటీలు శోధించాలి' అని ప్రణబ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరతిగతిన తగిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్క్షప్తి చేశారు. మన శక్తి సామర్ధ్యాలు స్వదేశీ పరిజ్ఞానానికి వినియోగించి పలు శాటిలైట్ లను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి వినియోగించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement