లోక్‌సభకు హాజరైన ప్రధాని మోదీ | PM narendramodi present in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభకు హాజరైన ప్రధాని మోదీ

Nov 30 2016 11:31 AM | Updated on Sep 27 2018 9:08 PM

లోక్‌సభకు హాజరైన ప్రధాని మోదీ - Sakshi

లోక్‌సభకు హాజరైన ప్రధాని మోదీ

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి.

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. బుధవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని లోక్‌ సభలో విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో స్పీకర్‌ మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. ఈ రోజు ప్రధాని మోదీ లోక్‌సభకు హాజరయ్యారు.  

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జమ్ము కశ్మీర్‌లో జవాన్ల మృతి ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభను 12 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్‌ మంత్రులతో సమావేశమై చర్చించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement