‘సంతాపం’పై పార్లమెంటులో రచ్చ | War in the Parliament | Sakshi
Sakshi News home page

‘సంతాపం’పై పార్లమెంటులో రచ్చ

Dec 1 2016 3:09 AM | Updated on Sep 27 2018 9:08 PM

‘సంతాపం’పై పార్లమెంటులో రచ్చ - Sakshi

‘సంతాపం’పై పార్లమెంటులో రచ్చ

పార్లమెంటు శీతాకాల సమావేశాల 11వ రోజూ గందరగోళంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.

నగ్రోటా అమరులకు సంతాపం తెలపాలన్న విపక్షాలు
- ఆపరేషన్ పూర్తయ్యాకే మాట్లాడతామన్న సర్కారు
- ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన.. వారుుదా
- జైట్లీ, శరద్ యాదవ్ మధ్య వాగ్యుద్ధం  
 
 న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల 11వ రోజూ గందరగోళంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సర్జికల్ దాడుల తర్వాత 25 మంది భారత జవాన్లు అమరులవటం, నోట్ల రద్దు కారణంగా 82 మంది మృతిచెందటంపై సంతాపం తెలపాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశారుు. అటు లోక్‌సభలోనూ నోట్లరద్దుపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని, అమరులైన జవాన్లకు సంతాపం తెలపాలనే డిమాండ్‌తో విపక్షాలు వాకౌట్ చేశారుు. తర్వాత సభ ప్రారంభమైనా గందరగోళం నడుమ వారుుదా పడింది.

 ‘నోట్ల’ఇబ్బందులు పట్టించుకోరా?
 ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా సర్జికల్ దాడుల తర్వాత భారత ఆర్మీజవాన్లపై దాడులు పెరిగాయని.. విపక్షాలు రాజ్యసభలో ఆరోపించారుు. ఈ దాడుల్లో అమరులైన జవాన్లతోపాటు నోట్లరద్దు నిర్ణయం కారణంగా ప్రాణాలు కోల్పోరుున ప్రజలకు సంతాపం తెలిపాలని డిమాండ్ చేశారుు. ‘సైనికులకు సంతాపం తెలిపేందుకు మనం సిద్ధంగా లేమా?’అని కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రశ్నించారు.  ‘నోట్ల రద్దుపై మీ పార్టీలో చర్చించుకుని సభలో మాట్లాడండి’అని జైట్లీ చెప్పగా.. దీనికి యాదవ్.. ‘నోట్లరద్దుపై తమకెలాంటి సమస్యలేదు. దీని అమల్లోనే ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. క్యూలైన్లలో మృతిచెందిన వారికి నివాళులు కూడా అర్పించలేమా? మీది, ప్రధానిది ఒకటే నిర్ణయమా? మీ మాట ఆయన వింటున్నారా?’ అని ప్రశ్నించారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ‘జై జవాన్, జై కిసాన్’నినాదాలు చేశారు. ‘చాలా రోజుల తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నినాదాలు వినిపించారుు’అని కురియన్ అన్నారు. అరుునా విపక్షాల నినాదాలు ఆగకపోవటంతో సభ గురువారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement