సోనియాను కలసిన నితీశ్‌ | Nitish Kumar Meets Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాను కలసిన నితీశ్‌

Apr 21 2017 12:43 AM | Updated on Mar 18 2019 9:02 PM

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు.

న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్‌ కోరినట్లు సమాచారం. ‘విపక్షాల తరపున బలమైన అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయాలి. విపక్షాలకు సోనియాగాంధీ నాయకత్వం వహించాలి. దీనికితోడు విపక్షాలన్నీ ఏకమై ముందుకెళ్లాల్సిన అవసరం పైనా చర్చ జరిగింది’ అని జేడీయూ ప్రతినిధి త్యాగీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement