
కేటీఆర్ ఒక్కరోజు కూలి 7 లక్షలు
మంత్రి కె.తారక రామారావు కోల్డ్ కాఫీ తయారు చేసి రూ.7లక్షలు సంపాదించారు.
- కోల్డ్ కాఫీ తయారుచేసిన మంత్రి..
కుత్బుల్లాపూర్: ఈ నెల 27న వరంగల్లో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం ‘గులాబీ కూలీ’దినాల పేరుతో మంత్రి కె.తారక రామారావు శుక్రవారం కుత్బుల్లాపూర్ సుచిత్ర సమీపంలో ఉన్న లాస్వేగాస్లోని ‘ది టీ ప్లానెట్’లో కోల్డ్ కాఫీ తయారు చేశారు. అలాగే రాక్స్టోన్ ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్క్రీమ్లు అమ్మారు. దీంతో సంకీత్రెడ్డి, సుధీర్రెడ్డి కూలి పనులు చేసిన మంత్రి కేటీఆర్కు రూ.1 లక్ష అందజేశారు.
నిజాంపేటకు చెందిన టీఆర్ఎస్ నేత కొలను శ్రీనివాస్రెడ్డి ఐస్క్రీమ్ కొనుగోలు చేసి రూ.1 లక్ష అందజేయగా, ఎంపీ మల్లారెడ్డి సైతం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఇలా ఒకేరోజు కుత్బుల్లాపూర్లో రూ. 7 లక్షలు కేటీఆర్ పోగుచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు పది కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న కొంపల్లిలో జరగనున్న టీఆర్ఎస్ 16వ ప్లీనరీని విజయవంతం చేసేందుకు పది నిర్వహణ కమిటీలను ఆ పార్టీ నాయకత్వం నియమించింది. వేదిక, సౌండ్ సిస్టం: ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సభా ప్రాంగణం: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అలంకరణ: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, భోజనాలు: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పార్కింగ్: ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, మీడియా: ఎమ్మెల్లీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, ప్రతినిధుల నమోదు: ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎం.రమేష్రెడ్డి, నయినేని రాజేశ్వర్రావు, సిరిమల్లే రాజు, ధర్మేందర్, పూర్ణచందర్రావు, జగదీశ్, సాంస్కృతిక బృందం: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ: ఎం.కమలాకర్ రెడ్డి, కమ్యూనికేషన్ (వైర్లెస్ సెట్లు, ఎల్ఈడీ తెరలు): సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, గుడాల భాస్కర్, ఎం.డి అమీర్, రాకేష్ను నియమించారు.