భారత్ కు తగినన్ని ప్రాథమిక సదుపాయాలు అవసరమని మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ:భారత్ కు ప్రపంచం గర్వించదగ్గ ప్రాథమిక సదుపాయాలు అవసరమని మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దీనిపై ప్రతీనెలా సమీక్షలు నిర్వహించి దేశ ప్రగతికి తోడ్పాటును అందించాలన్నారు. ఇందుకోసం బయట దేశాల్లోని మౌలిక సదుపాయ రంగాలపై అధ్యయనం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన తెలిపారు.
దేశంలో ఉన్న ఎనిమిది ముఖ్యమైన మౌలిక సదుపాయ రంగాలపై (ఇన్ ఫ్రాస్టక్చర్) దృష్టి సారించాలని మోడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా పౌర విమనాయానం, నౌకాయానం, రహదారులు, రైల్వే, టెలికాం, విద్యుత్, బొగ్గు, శక్తి రంగాలపై దృష్టి సారించాలన్నారు.