బరిలో తండ్రీ కొడుకులు | GHMC Electons special | Sakshi
Sakshi News home page

బరిలో తండ్రీ కొడుకులు

Jan 17 2016 5:30 AM | Updated on Oct 2 2018 3:48 PM

బరిలో తండ్రీ కొడుకులు - Sakshi

బరిలో తండ్రీ కొడుకులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. శనివారం నామినేషన్ల పర్వంలో తండ్రీకొడుకులు వేర్వేరు పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్‌రావు నగర్ డివిజన్ బీజేపీ రెబల్‌గా కాలేరు రవీందర్ ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆ కొద్దిసేపట్లోనే అదే డివిజన్ స్వతంత్య్ర అభ్యర్థిగా ఆయన కొడుకు కాలేరు నవీన్‌కుమార్ నామినేషన్ దాఖలు చేసి వచ్చారు. ఇద్దరూ నామినేషన్ వేసి బయటకు వచ్చాక కలుసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు.

ఇద్దరూ కలిసి నామినేషన్ వేయడం, ఇద్దరు కలిసి ఒకే వాహనంలో వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇద్దరిలో విజయం ఎవరిని వరించినా అది తమ కుటుంబానికే చెందుతుంది కదా అని వీరు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మా నాన్నే గెలుస్తారంటూ నవీన్‌కుమార్ ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు.
 - బంజారాహిల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement