ఎక్సైజ్ శాఖ ఏసీ బ్యాంకు లాకర్లలో రూ. 2.50 కోట్లకు పైగా బంగారం, వెండి
విజయవాడ సిటీ: ఆబ్కారీ శాఖ సహాయ కమిషనర్ మామిళ్లపల్లి ఆదిశేషు బ్యాంక్ లాకర్లలో కిలోల కొద్ది బంగారం, వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు బ్యాంకుల్లో బినామీల పేరిట ఉన్న లాకర్లలో గురువారం ఏసీబీ అధికారులు వీటిని గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సహాయ కమిషనర్ ఆదిశేషు ఆస్తులపై ఏసీబీ డీఎస్పీ ఆదిరెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో బుధవారం నుంచి విజయవాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి.
తొలిరోజు వేర్వేరు ప్రాంతాల్లోని రూ.80 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండోరోజు సోదాల్లో భాగంగా స్థానిక గవర్నర్పేటలోని ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ లాకర్ను తనిఖీ చేశారు. అక్కడ 4.5 కిలోల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని ధనలక్ష్మి బ్యాంక్లో ఆదిశేషు బంధువు బండి జగన్మోహన తాతారావు పేరిట ఉన్న లాకర్ను తనిఖీ చేశారు. అందులో సుమారు ఏడు కిలోల బరువైన బంగారు, వజ్రాల నగలు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 2.50 కోట్ల వరకు ఉండొచ్చనేది అధికారుల అంచనా.
ఇదిలా ఉండగా మొగల్రాజపురంలోని సున్నపు బట్టీల సెంటర్లో ఆదిశేషుకు మరో సొంత ఇల్లు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు రెండోరోజు గుర్తించారు. అక్కడ రూ. 30 లక్షల విలువైన చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఉండటాన్ని బట్టి వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ఆదిశేషు.. అనంత బంగారం
Published Fri, Jan 22 2016 4:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement