ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి | 2nd attack in Kabul as suicide bomber kills 20 police recruits | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి

Aug 7 2015 11:53 PM | Updated on Nov 6 2018 8:35 PM

అఫ్గనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పోలీస్ అకాడమీపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలు బలిగొన్నారు.

కాబుల్: అఫ్గనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పోలీస్ అకాడమీపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలు బలిగొన్నారు. మరో 30మంది వరకు గాయాలపాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు బాంబు దాడి జరగడం ఇది రెండో సారి.

కాబూల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ జరుగుతున్న సమయంలో వరుసలో నిల్చున్న ఓ ఉగ్రవాది.. తన ఒంటినిండ బాంబులు ధరించుకొని వచ్చాడు. అది గమనించని పోలీసుల సాధారణ పనుల్లో నిమగ్నమై ఉండగా.. అతడు అకాడమీ గేటు సమీపంలోకి రాగానే తనను తాను పేల్చుకున్నాడు. దీంతో అక్కడి వాతావరణం భీతావాహంగా తయారయింది. రిక్రూట్ మెంట్ వద్దకు వచ్చినవారితోపాటు కొందరు పోలీసులు ప్రాణాలు విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement