పుష్కర స్నానం చేస్తూ యువకుడు మృత్యువాత | Youth accidentally dies at Godavari Pushkaralu in Karimnagar | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం చేస్తూ యువకుడు మృత్యువాత

Jul 18 2015 6:20 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తుంగిడి గ్రామం సమీపంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

నవీపేట్ (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తుంగిడి గ్రామం సమీపంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మక్లూర్ మండలం బోక్లార్ గ్రామానికి చెందిన కుర్నపల్లి సంతోష్(18) శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో పుష్కర స్నానం చేసేందుకు ఒకటో ఘాట్ వద్ద గోదావరి నీటిలోకి దిగాడు. లోతుగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి,  ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. వెంటనే ఎవరూ రక్షించలేకపోవటంతో నీటిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement