పాముకాటుతో బాలింత మృతి | Woman dies from Snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో బాలింత మృతి

Jun 18 2015 5:13 PM | Updated on Oct 16 2018 3:12 PM

పాముకాటుతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా జోగిపేట మండలంలోని జగిర్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

మెదక్ (జోగిపేట) : పాముకాటుతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా జోగిపేట మండలంలోని జగిర్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జగిర్యాల గ్రామానికి చెందిన బోయిని రమేశ్, లక్ష్మి దంపతులకు మూడేళ్ల కూతురు శివాని ఉంది. కాగా వారం రోజుల కిందట లక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువుతోపాటు లక్ష్మి పెద్దశంకరంపేట మండలం ఆరెపల్లి గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. అయితే బుధవారం రాత్రి నిద్రలో ఉండగానే లక్ష్మి(25)ని పాము కరిచింది. వెంటనే కుటుంబీకులు నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున 108 వాహనంలో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మి ప్రాణాలొదిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement