ఒరిగిన వినాయకుడు: ఇద్దరికి గాయాలు | Two injured in Ganesh immersion | Sakshi
Sakshi News home page

ఒరిగిన వినాయకుడు: ఇద్దరికి గాయాలు

Sep 27 2015 8:12 AM | Updated on Aug 25 2018 5:39 PM

కరీంనగర్ పట్టణం సమీపంలోని మానకొండూరు చెరువులో నిమజ్జనానికి వెళుతున్న ఓ వినాయకుడి విగ్రహం ఒరిగి అక్కడున్న వారిపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ పట్టణం సమీపంలోని మానకొండూరు చెరువులో నిమజ్జనానికి వెళుతున్న ఓ వినాయకుడి విగ్రహం ఒరిగి అక్కడున్న వారిపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కరీంనగర్ పట్టణానికి చెందిన తిరుమల సాయి, పులి శివ అనే యువకులకు గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

కాగా మరోవైపు మానకొండూరు చెరువుకు నిమజ్జనం కోసం పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. ఆదివారం ఉదయానికే 600 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement