వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వేరు వేరు ఘటనల్లో మృతిచెందారు.
వరంగల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి
Mar 26 2017 2:04 PM | Updated on Mar 19 2019 9:03 PM
వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వేరు వేరు ఘటనల్లో మృతిచెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న అర్జున్ అనే కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందగా..
ఇదే కాలనీకి చెందిన ప్రసాద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల వరంగల్ హంటర్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించడంతో.. మండల కేంద్రంలో విషాదం అలుముకుంది.
Advertisement


