తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కేసీఆర్ | Telangana chief minister KCR accuses Narendra Modi government of bias | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కేసీఆర్

Nov 1 2014 6:25 PM | Updated on Sep 18 2018 8:28 PM

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కేసీఆర్ - Sakshi

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కేసీఆర్

ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) తీవ్రమైన విమర్శల్ని సంధించారు

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) తీవ్రమైన విమర్శల్ని సంధించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం పరిధిలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.  
 
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని, తమకు రావాల్సిన విద్యుత్ వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కేసీఆర్ ఆరోపించారు. పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 54 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. నవంబర్ 2 తేది వరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement