వేధింపుల కేసులో ముగ్గురి అరెస్టు! | students harassment in briliant college | Sakshi
Sakshi News home page

వేధింపుల కేసులో ముగ్గురి అరెస్టు!

Feb 27 2017 7:40 PM | Updated on Nov 9 2018 4:59 PM

అబ్దుల్లాపూర్‌మెట్‌ బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు సోమవారం పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు

రంగారెడ్డి: ఇంజినీరింగ్‌ కళాశాల ఉద్యోగులు శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగటంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు సోమవారం పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. 
 
విద్యార్థినులతో కళాశాల సిబ్బంది అసభ్యంగా ప్రవర్తింస్తున్నారని ఆరోపించారు. తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట మధ్యాహ్నం వరకు నిరసన తెలిపారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు పరీక్ష కళాశాల విభాగానికి చెందిన సాయినాథ్ రెడ్డి, గోపి, ఉస్మాన్ అనే ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వారిని తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement