ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ | One dead and 15 injured in Road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

Aug 31 2015 5:07 PM | Updated on Aug 30 2018 3:56 PM

తిరుమలాయపాలెం మండలం బ్రహ్మాయిగూడెం వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఖమ్మం (తిరుమలాయపాలెం) : తిరుమలాయపాలెం మండలం బ్రహ్మాయిగూడెం వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లలో ఐదుగురు బస్సులో ఇరుక్కుపోయారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని బయటికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement