యూపీలో వర్షం కురిస్తే తెలంగాణలో గొడుగు | mp kavitha interesting comments on bjp and congress | Sakshi
Sakshi News home page

యూపీలో వర్షం కురిస్తే తెలంగాణలో గొడుగు

Mar 31 2017 7:23 PM | Updated on Mar 29 2019 9:31 PM

యూపీలో వర్షం కురిస్తే తెలంగాణలో గొడుగు - Sakshi

యూపీలో వర్షం కురిస్తే తెలంగాణలో గొడుగు

టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి చురకలు అంటించారు.

నిజామాబాద్: టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి చురకలు అంటించారు. ఆమె శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. యూపీలో వర్షం కురిస్తే బీజేపీ నాయకులు తెలంగాణలో గొడుగు పడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ రాజకీయం ఢిల్లీలో నడుస్తుందని, గల్లీ రాజకీయం గల్లీలో నడుస్తుందని అన్నారు.

రైల్వే పనులు తమ హయాంలోనే అయ్యాయని,  అంతా తమ ప్రభుత్వాల దయ అని చెప్పుకోవడం సరికాదని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. స్వాతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారైనా సాధించింది గాంధీజీ అని అంతా చెప్పుకుంటారని, ఎలిజబెత్ రాణిని గురించి ఎవరూ చెప్పుకోరు కదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు కూడా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని ఎంపీ కవిత ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement