రైతు రుణమాఫీపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
రుణమాఫీపై త్వరలో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం
Jun 20 2014 6:37 PM | Updated on Jun 4 2019 5:04 PM
హైదరాబాద్: రైతు రుణమాఫీపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బేషరతుగా రుణమాఫీ చేయాలంటూ వస్తున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రుణమాఫీ వల్ల పడే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారంపై ఆర్ధికశాఖ అధికారుల నుంచి నివేదికను కేసీఆర్ కోరారు. అధికారుల నుంచి నివేదిక అందగానే రుణమాఫీపై కేబినెట్ ఆమోదం తీసుకుని ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు కేబినెట్ ప్రత్యేక సమావేశం కానుంది.
Advertisement
Advertisement