డిసెంబరు 3న..  జిల్లాకు కేసీఆర్‌ | KCR Elections Campaign In Nalgonda | Sakshi
Sakshi News home page

డిసెంబరు 3న..  జిల్లాకు కేసీఆర్‌

Nov 30 2018 7:38 AM | Updated on Aug 27 2019 4:45 PM

KCR Elections Campaign In Nalgonda - Sakshi

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ మరో విడత జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా ఎనిమిది నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్‌ నాలుగో విడతలో మరో నాలుగు సభల్లో పాల్గొననున్నారు. డిసెంబరు 3వ తేదీన ఆయన కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు డిసెంబరు మూడో తేదీన మధ్యాహ్నం 1.45 గంటకు కోదాడ, 2.30 గంటలకు హుజూర్‌నగర్, 3.30 గంటలకు మిర్యాలగూడ, 4.30 గంటలకు నల్లగొండ బహిరంగ సభల్లో పాల్గొంటారు.

రెండు నెలల తర్వాత మరోసారి నల్లగొండకు
సెప్టెంబరు 6వ తేదీన ప్రభుత్వం రద్దయిన వెంటనే టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలో ఏకంగా పది మంది అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు నెల రోజుల తర్వాత  ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసి అక్టోబరు 4వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభ జరిగిన రెండు నెలలకు మరోమారు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ నల్లగొండలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు  హాజరవుతున్నారు. నాలుగో విడత పర్యటనతో ఆయన జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసినట్లు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement