భార్యను చంపి భర్త ఆత్మహత్య | husband killed his wife in khammam distirict | Sakshi
Sakshi News home page

భార్యను చంపి భర్త ఆత్మహత్య

Apr 16 2015 10:27 AM | Updated on Aug 17 2018 7:48 PM

భార్యను చంపి భర్త ఆత్మహత్య - Sakshi

భార్యను చంపి భర్త ఆత్మహత్య

మద్యం మత్తులో భార్యను చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త.

చండ్రుగొండ : మద్యం మత్తులో భార్యను చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగుంట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సన్నెపల్లి రమేష్ (46) తాగుడికి బానిసయ్యాడు. ఈ క్రమంలో కనిపించిన అందరి దగ్గర డబ్బులు తీసుకుని తాగేవాడు. అంతేకాకుండా ఇంటిలో ఉన్న వస్తువులను అమ్ముకొని తాగడం ప్రారంభించారు. చివరికి తన భార్య మెడలోని మంగళసూత్రాన్ని కూడా అమ్మేసినట్టు సమాచారం. అయితే ఈరోజు ఉదయాన్నే తాగి ఇంటికి వచ్చిన రమేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మద్యం మత్తులో ఉన్న రమేష్ భార్యను గొడ్డలితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం రమేష్ కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.  స్తానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement