మా ఉత్తర్వులంటే లెక్క లేదా? | high court serious on snigdha reddy | Sakshi
Sakshi News home page

మా ఉత్తర్వులంటే లెక్క లేదా?

Apr 23 2015 1:03 AM | Updated on Aug 31 2018 8:24 PM

మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గనుల తవ్వకాల వ్యవహారంలో అధికారుల ...

స్నిగ్ధారెడ్డి వ్యవహారంలో గనులశాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు

హైదరాబాద్: మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గనుల తవ్వకాల వ్యవహారంలో అధికారుల తీరుపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నిగ్ధారెడ్డి తదితరులకు సహకరించేందుకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ మండిపడింది. లీజు ప్రాంతాన్ని దాటి మైనింగ్ నిర్వహించినందుకు ఎందుకు లీజు రద్దు చేయకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని చెబితే, ఆ పని చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మా ఉత్తర్వులంటే లెక్క లేదా అని ప్రశ్నించింది.

అధికారుల తీరును గమనిస్తుంటే, వారు అవతలి వారికి (స్నిగ్ధారెడ్డి, భరతసింహారెడ్డి) సహకరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తాము ఆదేశించిన విధంగా స్నిగ్ధారెడ్డికి ఎందుకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదో వివరిస్తూ, ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని గనులశాఖ డెరైక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోసలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement