జీబీఆర్ బస్సులో మంటలు..తప్పిన పెనుప్రమాదం | fire accident in bus | Sakshi
Sakshi News home page

జీబీఆర్ బస్సులో మంటలు..తప్పిన పెనుప్రమాదం

Jan 19 2015 11:01 AM | Updated on Apr 7 2019 3:28 PM

మెదక్: జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి వద్ద జీబీఆర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మెదక్: జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి వద్ద జీబీఆర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బస్సు ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నగర శివారు ప్రాంతమైన జహీరాబాద్ సమీపంలోకి ప్రవేశించగానే బస్సు కిందనుంచి పొగలు వ్యాపించడం ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రయాణికులు రోడ్డు విస్తరణ సిబ్బంది  కేకలు వేసినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో వారు మరో వాహనంలో వోల్వోను ఛేజ్ చేసి కేకలు వేయడంతో ప్రయాణికులంతా బస్సు దిగిపోయారు. అనంతరం వారు చూస్తుండగానే మంటలు మొత్తం వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం మంటల్లో కాలి బూడిదయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement