విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Oct 14 2015 8:02 PM | Updated on Oct 17 2018 6:06 PM

కాపలా కుక్కకు తిండి పెట్టడానికి వెళ్లిన రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం అడవిలింగాలలో జరిగింది.

కాపలా కుక్కకు తిండి పెట్టడానికి వెళ్లిన రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం అడవిలింగాలలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శివగారి బాలరాజు(46) కుక్కకు భోజనం పెట్టేందుకు మంగళవారం రాత్రి పొలానికి వెళ్లాడు.

తిరిగి ఇంటికి రాకపోవడంతో అక్కడే పడుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. బుధవారం ఉదయం కూడా రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా కనిపించాడు, బోరు మోటార్ వద్ద ఉండే ఎర్త్ వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై్స శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement