కరెంటు తీగలు పట్టుకుని రమావత్ రాజు(40) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరెంటు తీగలు పట్టుకుని రైతు ఆత్మహత్య
Dec 9 2015 5:20 PM | Updated on Oct 1 2018 2:36 PM
నాంపల్లి: కరెంటు తీగలు పట్టుకుని రమావత్ రాజు(40) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లి పంచాయతీ రత్యాతండాలో బుధవారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. రాజుకు సొంతంగా మూడు ఎకరాలు ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. పంట సరిగ్గా పండక సుమారు రూ.4 లక్షల మేర అప్పులు అయ్యాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం తోచక పొలానికి వెళ్లి కరెంటు తీగలు పట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement